Tag Archives: sandals

Adipurush: డబ్బు కోసమే ఆ ప్లాన్… ఆది పురుష్ సినిమా గురించి మరోసారి గుప్పుమన్న పుకార్లు…?

Adipurush: పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన తాజా చిత్రం ఆది పురుష్. ప్రభాస్ మొదటిసారిగా రామాయణం వంటి పౌరాణిక కథలో నటిస్తుండటంతో ఈ సినిమా మీద ప్రేక్షకులో భారీ అంచనాలు పెట్టుకున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించడం వల్ల సినిమా మీద ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాని దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమా గురించి ప్రేక్షకులు ఆకృతగా ఎదురు చూస్తుంటే మరికొందరు మాత్రం పని కట్టుకొని ఈ సినిమా గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే ఆది పురుష్ సినిమా గురించి అనేక రూమర్లు వినిపించాయి. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రభాస్ వేషధారణ గురించి నెగెటివిటీ స్ప్రెడ్ చేశారు. రాముడికి మీసాలు ఉండవని, అంతేకాకుండా ఈ సినిమాలో ప్రభాస్ చెప్పులు కూడా ధరించాడని సినిమా గురించి నెగెటివిటీ స్ప్రెడ్ చేశారు.

ఈ సినిమా విడుదల చేసినప్పుడు థియేటర్లలో హనుమంతుడి కోసం ఒక సీట్ కేటాయించాలని ఈ సినిమా దర్శకుడు ప్రీ రిలీజ్ ఈవెంట్లో వెల్లడించాడు. ఎందుకంటే రాముడికి పరమ భక్తుడైన హనుమంతుడు రాముడి పారాయణం జరిగే ప్రతి చోట ఉంటాడని అందువల్ల సినిమా విడుదల చేసిన ప్రతి థియేటర్లో హనుమంతుడి కోసం ఒక సీటు కేటాయించాలని విజ్ఞప్తి చేశాడు. అయితే దీని గురించి కూడా కొందరు పనిగట్టుకుని పుకార్లు పుట్టిస్తూ సినిమా మీద నెగెటివిటీ స్ప్రెడ్ చేయటానికి ప్రయత్నిస్తున్నారు.

Adipurush: భక్తితో కాదు… డబ్బు కోసమే


ఆదిపురుష్ యూనిట్ హనుమంతుడికి సీట్ కేటాయిస్తోంది భక్తితో కాదని.. డబ్బు కోసం అంటూ పుకార్లు వ్యాప్తి చేస్తున్నారు. హనుమంతుడికి కేటాయించిన సీట్ పక్క సీట్లకి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. కాబట్టి హనుమంతుడి పక్క సీట్ల టికెట్ ధరల్ని అధిక మొత్తంలో పెంచి విక్రయించబోతున్నట్లు వార్తలు వైరల్ చేస్తున్నారు. అయితే ఈ రూమర్ పై చిత్ర యూనిట్ స్పందిస్తూ ఆ వార్తలలో వాస్తవం లేదని ఫేక్, హనుమంతుడి పక్క సీట్ల టికెట్ ధరలు కూడా నార్మల్ గానే ఉంటాయి అని క్లారిటీ ఇచ్చారు.

Adipurush: ఆది పురుష్ సినిమా చూడాలంటే థియేటర్లకు అలా వెళ్లాల్సిందేనా… వైరల్ అవుతున్న న్యూస్!

Adipurush: ప్రభాస్ హీరోగా నటిస్తున్నటువంటి తాజా చిత్రం ఆది పురుష్. రామాయణం ఇతిహాసం నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి ఈ సినిమా జూన్ 16వ తేదీ విడుదల కాబోతోంది ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తిరుపతిలో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే.

ఇక ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా రామాయణం ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కుతున్న నేపథ్యంలో ఈ సినిమాని చూడటానికి థియేటర్ కి వచ్చే వారందరూ కూడా చెప్పులు లేకుండా థియేటర్లోకి వచ్చే సినిమా చూడాలి అంటూ ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు చెప్పులు బయటే వదిలి వెళ్తాము అలాంటిది రామాయణం తరహాలో రాబోతున్న సినిమాని చూడటానికి కూడా చెప్పులు థియేటర్ బయట వదిలి వెళ్లాలంటూ వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇక ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుకను తిరుపతిలో నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ కార్యక్రమంలో చిత్ర బృందం కూడా పాల్గొని సందడి చేశారు.

Adipurush: చెప్పులు వేసుకుని చిత్ర బృందం…


ఈ కార్యక్రమానికి చిన్న జీయర్ స్వామి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇక ఈ వేదికపై ప్రభాస్ తో సహా ఇతర చిత్ర బృందం కూడా చెప్పులు లేకుండా తిరగడం మనం చూసాము అందుకే థియేటర్లో ఈ సినిమాని వీక్షించే సమయంలో చెప్పులు కూడా వేసుకోకుండా సినిమాని చూడాలని అందుకే చెప్పులు లేకుండా ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లాలని ఓ వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.

అనుష్క చెప్పుల ఖరీదు తెలిస్తే కళ్ళు తిరగాల్సిందే !!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె ఏ చిన్న విషయం అయినా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసినా అది వైరల్ గా మారుతుంది. అనుష్క శర్మ టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం టీమిండియా క్రికెటర్ లందరూ ఇంగ్లాండ్ లోని సౌతాంప్టన్ హోటల్‌లో క్వారంటైన్‌లో ఉన్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్, ఇంగ్లాండ్‌తో 5 టెస్టు మ్యాచ్‌ల సిరీస్ నేపథ్యంలో మూడున్నర నెలల పాటు సుదీర్ఘ పర్యటన చేయబోతున్న ఈ నేపథ్యంలో క్రికెటర్లు తమ వెంట వారి కుటుంబాన్ని తీసుకురావడానికి ఇంగ్లాండ్ ప్రభుత్వంతో పాటు బీసీసీఐ అనుమతి తెలిపింది.

ఈ క్రమంలోనే క్రికెటర్లు అందరూ తమ కుటుంబంతో సహా ఇంగ్లాండ్ చేరుకున్నారు. వీరిలో విరాట్ కోహ్లీ తోపాటు భార్య అనుష్కశర్మ ,కూతురు వామికా కూడా ఉన్నారు. ఇంగ్లాండ్ లో ఒక హోటల్ లో క్వారంటైన్ లో ఉన్న కోహ్లీ కుటుంబం తాజాగా శనివారం సాయంత్రం అనుష్క హోటల్ గది నుంచి బయటకు వచ్చి రోజ్ బౌల్ స్టేడియం బాల్కనీలో నిల్చొని దిగిన ఫోటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

అనుష్క శర్మ షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటో చూసిన నెటిజనులకు ఆమె డ్రెస్సింగ్ స్టైల్ నచ్చగా మరికొందరు చూపు మాత్రం ఆమె వేసుకున్న చెప్పుల పై పడింది.అనుష్క శర్మ కొత్త రకం గూచీ చెప్పల్ వేసుకొని కనిపించింది. చెప్పులపై గూచీ లోగోతో పాటు పూల్ సైడ్ ధరించే మోడల్‌లా తీర్చి దిద్దారు.అనుష్క ఈ విధమైనటువంటి చెప్పులు ధరించడంతో నెటిజన్లు చెప్పులు ధర ఎంత ఉంటుంది అన్న వేటలో పడి వేతకసాగారు.

ఈ క్రమంలోనే అనుష్క వేసుకున్న చెప్పుల ధర ఏకంగా రూ. 31,892 అంటా. ఇంత ఖరీదైన చెప్పులు వేసుకోవడంతో నెటిజన్లు ఆ డబ్బులతో మనం ఎన్ని జతల చెప్పులు కొనుక్కోవచ్ఛో అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం అనుష్క షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.