Adipurush: పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన తాజా చిత్రం ఆది పురుష్. ప్రభాస్ మొదటిసారిగా రామాయణం వంటి పౌరాణిక కథలో నటిస్తుండటంతో ఈ సినిమా మీద ప్రేక్షకులో భారీ అంచనాలు పెట్టుకున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించడం వల్ల సినిమా మీద ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాని దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు.
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమా గురించి ప్రేక్షకులు ఆకృతగా ఎదురు చూస్తుంటే మరికొందరు మాత్రం పని కట్టుకొని ఈ సినిమా గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే ఆది పురుష్ సినిమా గురించి అనేక రూమర్లు వినిపించాయి. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రభాస్ వేషధారణ గురించి నెగెటివిటీ స్ప్రెడ్ చేశారు. రాముడికి మీసాలు ఉండవని, అంతేకాకుండా ఈ సినిమాలో ప్రభాస్ చెప్పులు కూడా ధరించాడని సినిమా గురించి నెగెటివిటీ స్ప్రెడ్ చేశారు.
ఈ సినిమా విడుదల చేసినప్పుడు థియేటర్లలో హనుమంతుడి కోసం ఒక సీట్ కేటాయించాలని ఈ సినిమా దర్శకుడు ప్రీ రిలీజ్ ఈవెంట్లో వెల్లడించాడు. ఎందుకంటే రాముడికి పరమ భక్తుడైన హనుమంతుడు రాముడి పారాయణం జరిగే ప్రతి చోట ఉంటాడని అందువల్ల సినిమా విడుదల చేసిన ప్రతి థియేటర్లో హనుమంతుడి కోసం ఒక సీటు కేటాయించాలని విజ్ఞప్తి చేశాడు. అయితే దీని గురించి కూడా కొందరు పనిగట్టుకుని పుకార్లు పుట్టిస్తూ సినిమా మీద నెగెటివిటీ స్ప్రెడ్ చేయటానికి ప్రయత్నిస్తున్నారు.
ఆదిపురుష్ యూనిట్ హనుమంతుడికి సీట్ కేటాయిస్తోంది భక్తితో కాదని.. డబ్బు కోసం అంటూ పుకార్లు వ్యాప్తి చేస్తున్నారు. హనుమంతుడికి కేటాయించిన సీట్ పక్క సీట్లకి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. కాబట్టి హనుమంతుడి పక్క సీట్ల టికెట్ ధరల్ని అధిక మొత్తంలో పెంచి విక్రయించబోతున్నట్లు వార్తలు వైరల్ చేస్తున్నారు. అయితే ఈ రూమర్ పై చిత్ర యూనిట్ స్పందిస్తూ ఆ వార్తలలో వాస్తవం లేదని ఫేక్, హనుమంతుడి పక్క సీట్ల టికెట్ ధరలు కూడా నార్మల్ గానే ఉంటాయి అని క్లారిటీ ఇచ్చారు.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…