Pathan Movie: ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్క సినిమా కూడా ఏదో ఒక వివాదాన్ని ఎదుర్కొంటూ ఉంది.ఈ క్రమంలోనే తాజాగా బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ దీపికా పదుకొనే జంటగా నటిస్తున్న చిత్రం పఠాన్.ఈ సినిమా జనవరి 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా నుంచి వరుస అప్డేట్స్ విడుదల చేస్తూ సినిమాపై భారీ అంచనాలను పెంచుతున్నారు.
ఈ క్రమంలోనే పఠాన్ సినిమా నుంచి తాజాగా విడుదలైనటువంటి బేషారం రంగ్ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది అయితే ఈ పాట విడుదలైన అనంతరం ఇందులో దీపిక పదుకొనే వస్త్ర ధారణ గురించి పెద్ద ఎత్తున విమర్శలు వెళ్లవెత్తుతున్నాయి. ఇందులో ఈమె భారీ ఎక్స్పోజ్ చేస్తూ డ్రెస్ వేసుకోవడంతో పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పెళ్లయినప్పటికీ దీపికా పదుకొనే ఏమాత్రం ఎక్స్పోజింగ్ తగ్గించడం లేదని కొందరు కామెంట్లు చేయగా మరి కొందరు అవకాశాలు తగ్గుతున్న నేపథ్యంలో ఇలా అవకాశాల కోసం ఎక్స్పోజ్ చేస్తున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే తాజాగా ఈ పాటలో దీపికా పదుకొనే వస్త్రధారణ పై స్పందించిన మధ్యప్రదేశ్ మంత్రి నరోత్తమ్ మిశ్రా షాకింగ్ కామెంట్లు చేశారు.
Pathan Movie:మంత్రులు కూడా సెన్సార్ సభ్యులు అయ్యారా…
బేషారం రంగ్ సాంగ్ లో నటి దీపిక పదుకొనే వస్త్రధారణ ఏమాత్రం బాగాలేదని, డర్టీ మైండ్ సెట్ తో ఈ పాటను చిత్రీకరించారని ఈయన మండిపడ్డారు. ఈ క్రమంలోనే ఈ పాటలోని క్లిప్పింగ్స్, దీపిక డ్రెస్సింగ్, వంటివి కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అలా చేయకపోతే ఈ సినిమాని మధ్యప్రదేశ్లో విడుదల కానివ్వమంటూ చిత్ర బృందం పై మండిపడుతూ వారికి వార్నింగ్ ఇచ్చారు.ఇలా మినిస్టర్ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో ఈ మధ్యకాలంలో మంత్రులు కూడా సెన్సార్ సభ్యులయ్యారా అంటూ కొందరు సెటైర్లు వేస్తూ కామెంట్లు చేస్తున్నారు.
Nayanathara: లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం తన వైవాహిక జీవితాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. గత ఏడు సంవత్సరాల నుంచి దర్శకుడు విగ్నేష్ ప్రేమలో ఉన్నటువంటి ఈమె ఈ ఏడాది జూన్ నెలలో తన భర్తను ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. వీరి వివాహం తర్వాత నయనతార ఒకవైపు సినిమాలలో నటిస్తూనే తనకు ఏ మాత్రం విరామం దొరికిన విదేశాలకు వెళ్తూ భర్తతో కలిసి ఎంజాయ్ చేస్తుంది.
ఈ క్రమంలోనే నయనతార దంపతులు ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక దుబాయ్ పర్యటనలో ఉన్నటువంటి ఈమె తన భర్త విగ్నేష్ పుట్టినరోజు కావడంతో తన భర్తకు సర్ప్రైజ్ పార్టీ అరేంజ్ చేశారు. దుబాయిలో అత్యంత అందమైనటువంటి
బుర్జ్ ఖలీఫా దగ్గర తన భర్త పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేశారు. ఇలా తన భర్త వేడుకలలో భాగంగా విగ్నేష్ తల్లి ఆయన సోదరుడు కూడా పాల్గొన్నారు.
ఇలా దుబాయ్ లో విగ్నేష్ కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుక జరుపుకోవడమే కాకుండా పెద్ద ఎత్తున టపాసులు పేలుస్తూ ఈయన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇక ఈ పుట్టిన రోజు సందర్భంగా విగ్నేష్ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు. స్వచ్ఛమైన ప్రేమను అందించి నా కుటుంబంతో పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నాను. నా ప్రియమైన వారందరితో కలిసి బుర్జ్ ఖలీఫా కింద నా భార్య కలలు కనే పుట్టినరోజు…ఇంతకన్నా గొప్పది ఏది ఉండదు ఇలా నా జీవితంలో ఆనందమైన క్షణాలను అందించినందుకు భగవంతునికి ధన్యవాదాలు అంటూ ఈయన ఎమోషనల్ పోస్ట్ చేశారు.
Nayanathara: జవాన్ సినిమాతో బిజీగా ఉన్న నయనతార..
ఈ విధంగా నయనతార తన భర్తకు పుట్టినరోజు వేడుకలు నిర్వహించినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హీరో షారుక్ ఖాన్ తో కలిసి జవాన్ అనే సినిమాలు నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ద్వారా ఈమె బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇలా వివాహం తర్వాత కూడా ఈమె సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.
ప్రస్తుతం డ్రగ్స్ కేసులో భాగంగా ఆర్యన్ నాలుగు వారాల పాటు జైలులో గడిపి బయటకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఆర్యన్ ఖాన్ మాదిరిగానే గతంలో షారుఖ్ ఖాన్ కూడా జైలుకి వెళ్లి వచ్చారని చాలామందికి తెలియదు.అయితే షారుక్ జైలుకు వెళ్ళడానికి గల కారణం కేవలం ఒక జర్నలిస్టు కత్తితో బెదిరించడం వల్ల జైలుకు వెళ్లానని స్వయంగా షారుక్ ఒక సందర్భంలో వెల్లడించారు.
తెహల్కా డాట్ కామ్ ఆర్గనైజ్ చేసిన ‘థింక్ 2012’ ఈవెంట్లో చీఫ్ గెస్ట్గా పాల్గొన్న షారుక్ ఈ విషయాన్ని బహిరంగంగా వెల్లడించారు.అయితే ఆ జర్నలిస్టు కత్తితో బెదిరించడానికి కారణం ఏమిటి అనే విషయానికి వస్తే… గతంలో షారుక్ ఖాన్ కి ఒక హీరోయిన్ తో ఎఫైర్ ఉందని ఆ జర్నలిస్ట్ రాయడంతో అందుకు ఆగ్రహం వ్యక్తం చేసిన అతని పై కత్తితో దాడి చేశారని తెలిపారు.
అయితే తనకు గౌరీ ఖాన్ తో పెళ్లి జరిగిన రెండు సంవత్సరాలకు ఆ జర్నలిస్టు ఈ విధంగా రాయడమే కాకుండా తన వ్యక్తిత్వం మంచిది కాదంటూ రాయడంతో షారుక్ ఖాన్ పెళ్లి సమయంలో తన మామ ఇచ్చిన కత్తిని తీసుకొని ఆ కత్తితో జర్నలిస్టును బెదిరించినట్లు తెలిపారు. ఇలా అతనిని బెదిరించినందుకుగాను షారుఖ్ జైలుకు వెళ్లారని తెలిపారు.
అయితే జైలులో ఉన్నప్పుడు తనకు ఎవరికైనా ఫోన్ చేసుకునే అవకాశం లభిస్తే తాను కుటుంబ సభ్యులకు ఫోన్ చేయకుండా ఆ జర్నలిస్టుకి ఫోన్ చేసి బెదిరించారని, బయటకు వచ్చిన తర్వాత నీ అంతు చూస్తా, నిన్ను నరుకుతా అంటూ షారుక్ ఆ జర్నలిస్ట్ ను బెదిరించినట్లు తెలిపారు. ఇలా షారుక్ ఖాన్ గతంలో జైలుకు వెళ్లి వచ్చినట్లు ఆయన తెలిపారు.
Top Telugu website in the world | Telugu Gossips | Breaking News Headlines, Latest Andhra News, Telangana News, India News, World News – Telugudesk.net