Tag Archives: shocking incident

సరదాగా నడుచుకుంటూ వెళ్లిన ఆ బాలుడు కరెంట్ పోల్ ను తాకాడు.. తర్వాత ఏమైందంటే..

ప్రమాదవశాత్తు ఇలాంటి ఘటనలు జరుగుతాయని మనం అస్సలు ఊహించి ఉండం. ప్రస్తుతం వర్షాకాలం కాబట్టి కరెంట్ స్తంభాలను తాకే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఇలా ఓ కుర్రాడు కరెంట్ స్తంభాన్ని పట్టుకొని అక్కడిక్కడే కూలపడ్డాడు. అక్కడ ఉన్న మరో వ్యక్తి చాకచక్యంగా వ్యవహరించి అక్కడే ఉన్న కర్ర సహాయంతో అతడిని బయటకు లాగాడు.

ఈ ఘటన రాజస్థాన్‌లోని చురు జిల్లాలో ఉన్న సదుల్‌పూర్ తాలూకా నుహంద్ అనే గ్రామంలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన అదిల్ అనే ఆరేళ్ల పిల్లాడు తన స్నేహితుడైన మరో బాలుడితో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వస్తున్నాడు. సరాదగా మాట్లాడుకుంటూ వస్తుండగా.. ఎదురుగా ఉన్న ఓ కరెంట్ స్తంభాన్ని అందులో ఒక పిల్లాడు పట్టుకున్నాడు.

అది గమనించని మరో బాలుడు అక్కడ నుంచి వెళ్లిపోయాడు. అటు నుంచి వస్తున్న మరో వ్యక్తి ఆ బాలుడికి కరెంట్ షాక్ తగిలిందని గ్రహించాడు. వెంటనే అతడు పక్కనే ఉన్న ఓ చెక్కను తీసుకొని వచ్చి ముందుగా అతడి చెయ్యిపై కొట్టాడు. ఆ తర్వాత ఆ బాలుడిని పక్కకు గుంజాడు. మరికొంతమంది వచ్చి అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఓ వాహనంలో ఎక్కించారు.

అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. ఆ సమయంలో చాకచక్యంగా వ్యవహరించిన అతడిని ప్రతీ ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మరింది. వర్షాకాలంలోనే కాదు.. ఎప్పుడైనా కరెంట్ స్తంభాలను పట్టుకోవడం అనేది మంచిది కాదంటూ.. కొంతమంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అతడి శరీరం నుంచి పొగలు రావడంతో ఆ బాలుడి పరిస్థితి విషమంగా ఉండే ఉండొచ్చు అనేది కొంతమంది కామెంట్లు పెడుతున్నారు.

మహిళలకు ఢిల్లీలో రక్షణ లేదు.. దానికి ఉదాహరణ నాదే: బాలీవుడ్ నటి నిఖిత రావల్

ఢిల్లీలోని శాస్త్రి నగర్‌లో తుపాకీతో తనను కొందరు దుండగులు బెదిరించి దాదాపు రూ.7 లక్షల వరకు దోచుకున్నట్లు బాలీవుడ్ నటి నిఖిత రావల్ చెప్పుకొచ్చారు. ఆ భయంకరమైన ఘటన గురించి ఆమె మాట్లాడారు. అప్పటి నుంచి ఢిల్లీలో ఏ పని చేయాలన్నా భయంగా ఉందంటూ చెప్పుకొచ్చారు. ఈ భయానక సంఘటనను గుర్తుచేసుకుంటూ నిఖిత ఏం మాట్లాడారంటే.. ఎంగేజ్‌మెంట్ పార్టీలో అతిథి పాత్ర కోసం ఢిల్లీకి వచ్చానని చెప్పారు.

ఆమెతో పాటు ఆమె చెల్లెలు కూడా ఉన్నారు. రాత్రి 10 గంటల సమయంలో వారు ఈవెంట్ నుండి శాస్త్రి నగర్‌లోని తన అత్త ఇంటికి తిరిగి వస్తుండగా.. ఆమెకు ఎదురుగా ఓ కారు వచ్చి ఆగిందని.. అందులో నుంచి కొందరు ముఖాలకు మాస్కులు ధరించి.. కోతి టోపీలు పెట్టుకొని కొందరు కారు నుంచి దిగారన్నారు. తర్వాత వెంటనే తన వద్దకు వచ్చి ఒకడు తుపాకీ తీసి.. మరొకరు కత్తి తీసి.. తన వద్ద డబ్బులను ఇవ్వమని బెదిరించారన్నారు. అంతే కాకుండా తనను దుర్భాషలాడుతూ.. బెదిరించి పర్సు, డబ్బులు, డైమండ్ రింగు మరియు చెవి కమ్మలను దోచుకెళ్లినట్లు చెప్పారు.

ఆమెతో పాటు తన చెల్లి కూడా ఉందంటూ చెప్పుకొచ్చారు. వాళ్లు తనను బెదిరిస్తున్న సమయంలో నిర్భయ ఘటన ఆమె మనస్సులోకి వచ్చినట్లు చెప్పింది. వాళ్లు వెళ్లిపోగానే వెంటనే హుటాహుటిన తన అత్త ఇంటికి చేరుకోగా.. 10 నిమిషాల వరకు అదే ఘటనను గుర్తు చేసుకుంటూ ఎంతో భయటపడి పోయానని చెప్పారు. తర్వాత ఆమె ఆ షాక్ నుంచి తేరుకోగానే వెంటనే తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పారట.

తర్వాత వెంటనే ఒక్క క్షణం కూడా ఢిల్లీలో ఉండకూడదని నిర్ణయించుకున్నారట. ఆ సమయంలో తనను తుపాకీతో కాల్చినా.. రేప్ చేసినా తన పరిస్థితి ఏంటని తలచుకొని.. ఆ చేదు అనుభవాన్ని ఇంకా మర్చిపోలేక పోతున్నట్లు చెప్పారు. ఢిల్లీలో ముమ్మటికీ ఆడవాళ్లకు భద్రత లేదని.. కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

కామంతో కళ్లు మూసుకుపోయి.. పక్కింటి మహిళ బాత్రూమ్ లో సెక్రెట్ కేమరా పెట్టాడు.. అడ్డంగా బుక్కయ్యాడు..

కామంతో కళ్లు మూసుకుపోయిన వాడు ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు. ఓ మహిళ స్నానం చేస్తుండగా సీక్రెట్ గా కెమెరా అమర్చి వీడియో రికార్డు చేశాడు. దానిని తీసుకొని అందులో స్నానం చేస్తున్న వీడియో చూసి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడో ఓ ప్రబుద్దుడు. ఇలానే మరో రోజు రికార్డు చేస్తున్న క్రమంలో లేసర్ లైట్ వెలుగుతుండగా గమనించిన సదరు మహిళ భర్తకు చెప్పింది.

దీంతో వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేయగా అతడిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని తంజావూరుకు చెందిన మాజీ డిప్యూటీ పోలీస్ ఇన్‌స్పెక్టర్ కు 35 ఏళ్ల కొడుకు ఉన్నాడు. అతడి పేరు నసీర్ అహ్మద్. అతడికి వివాహం అయి ఆరు సంవత్సరాల పాప కూడా ఉంది. అతడు నివాసం ఉంటున్న ఇంటి పక్కనే ఓ వ్యక్తి కిరాయికి ఉంటున్నాడు.

అతడికి భార్య, కూతురు ఉన్నారు. అతడు అక్కడే ఓ ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా పని చేస్తున్నాడు. వీళ్ల బాత్రూం నసీర్ నివాసం ఉండే ఇంటికి సమీపంలో ఉండేది. అయితే పక్కనే ఉన్న ఇంటి మేడపైకి ఎక్కి అక్కడ బాత్రూంలో రహస్య కెమెరా అమర్చాడు. ఇలా వాళ్లు స్నానం చేస్తుండగా వీడియోలు రికార్డు చేసి.. వాటిని అతడే చూసి పైశాచిక ఆనందాన్ని పొందేవాడు. ఇలా ఓ రోజు ఆమె రహస్య కెమెరాను గుర్తించి భర్తకు చెప్పింది. వారిద్దరు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అతడు మాజీ డిప్యూటీ పోలీస్ ఇన్‌స్పెక్టర్ కుమారుడిగా గుర్తించి అరెస్టు చేశారు. అతడితో కొన్ని రోజుల క్రితమే సదరు మహిళ భర్తకు గొడవ అయింది. ఓ రోజు అతడి కూతురు స్నానం చేస్తుండగా మేడ పైకి వెళ్లి చూస్తున్న క్రమంలో అతనితో గొడవ పెట్టుకున్నాడు. అప్పటి నుంచి కోపం పెంచుకున్న నసీర్ మరింతగా రెచ్చిపోయి ఇలా చేశాడని పోలీసులు వెల్లడించారు.