Tag Archives: shooting update

మొదటి సినిమా షూటింగ్ పూర్తిచేసుకున్న అల్లు అర్హ.. నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న వీడ్కోలు వీడియో!

సినిమా ఇండస్ట్రీలో అల్లు కుటుంబానికి ఉన్న ప్రత్యేకత గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే మూడు తరాలు ఇండస్ట్రీలో ఎంతో విజయవంతంగా దూసుకుపోతున్న క్రమంలో నాల్గవ తరంగా, అల్లు కుటుంబం నుంచి ఒక వారసురాలిగా అల్లు అర్హ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం ఇదే మొదటిసారి.

గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “శాకుంతలం” అనే చిత్రంలో అల్లుఅర్హ చిన్నప్పటి భరతుడి పాత్రలో నటించింది. అయితే గత కొద్ది రోజుల నుంచి షూటింగ్ లో పాల్గొన్న అర్హ తన షూటింగ్ కంప్లీట్ చేసిందని తెలుస్తోంది.ఈ క్రమంలోనే చిత్రబృందం అల్లు అర్హకు ఘనంగా వీడ్కోలు పలికారు.

ఈ వేడుకలో భాగంగా అల్లు అర్హతో కేక్ కట్ చేయించి ఆమెకు చిత్రబృందం వీడ్కోలు పలికారు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ కార్యక్రమంలో అల్లుఅర్హ తండ్రి అల్లు అర్జున్ స్నేహ రెడ్డి పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఈ వీడియోను అల్లుఅర్జున్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ నిర్మాత నీలిమగుణ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఇక ఈ సినిమాలో శకుంతల పాత్రలో సమంత నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత కొడుకు పాత్రలో అల్లు అర్హ నటించింది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెండవ షెడ్యూల్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.త్వరగా షూటింగ్ పనులను పూర్తి చేసుకొని వచ్చే ఏడాదిలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది.

కొత్త బిరుదు తెచ్చుకున్న కాజల్ అగర్వాల్?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గ్లామర్ బ్యూటీ కాజల్ అగర్వాల్. తన నటనతో, అందంతో మంచి గుర్తింపు తెచ్చుకొని ఎంతోమంది అభిమానుల హృదయాలలో నిలిచింది. లక్ష్మీ కళ్యాణం సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ ఆ తర్వాత ఎన్నో సినిమాలలో స్టార్ హీరోల సరసన నటించింది. ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ.. పెళ్లి తర్వాత కూడా అసలు తగ్గట్లేదు. ప్రస్తుతం వరుస ఆఫర్లతో బాగా బిజీగా ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన భర్తతో దిగిన ఫోటోలను బాగా షేర్ చేసుకుంటుంది. తాజాగా తన ఇన్ స్టా వేదికగా ఓ ఫోటో షేర్ చేసుకోగా అందులో పుస్తకం చదువుతూ కనిపించింది. అంతేకాకుండా ఎప్పటికైనా పుస్తకాల పురుగునే అంటూ తనకు తాను బిరుదు తీసుకుంది.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గ్లామర్ బ్యూటీ కాజల్ అగర్వాల్

తన నటనతో, అందంతో మంచి గుర్తింపు తెచ్చుకొని ఎంతోమంది అభిమానుల హృదయాలలో నిలిచింది.

లక్ష్మీ కళ్యాణం సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ ఆ తర్వాత ఎన్నో సినిమాలలో స్టార్ హీరోల సరసన నటించింది.

ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ..

పెళ్లి తర్వాత కూడా అసలు తగ్గట్లేదు.

ప్రస్తుతం వరుస ఆఫర్లతో బాగా బిజీగా ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన భర్తతో దిగిన ఫోటోలను బాగా షేర్ చేసుకుంటుంది.

తాజాగా తన ఇన్ స్టా వేదికగా ఓ ఫోటో షేర్ చేసుకోగా అందులో పుస్తకం చదువుతూ కనిపించింది.

అంతేకాకుండా ఎప్పటికైనా పుస్తకాల పురుగునే అంటూ తనకు తాను బిరుదు తీసుకుంది

టాలీవుడ్ సినీ నటి ప్రియమణి లేటెస్ట్ ఫోటోలు..

టాలీవుడ్ సినీ నటి ప్రియమణి లేటెస్ట్ ఫోటోలు..

టాలీవుడ్ సినీ నటి ప్రియమణి లేటెస్ట్ ఫోటోలు..

టాలీవుడ్ సినీ నటి ప్రియమణి లేటెస్ట్ ఫోటోలు..

టాలీవుడ్ సినీ నటి ప్రియమణి లేటెస్ట్ ఫోటోలు..

టాలీవుడ్ సినీ నటి ప్రియమణి లేటెస్ట్ ఫోటోలు..

ఆ రెండు మినహా షూటింగ్ పూర్తి చేసుకున్న.. ఆర్ఆర్ఆర్ ?

టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాలలో రాజమౌళి “ఆర్ఆర్ఆర్” ఒకటని చెప్పవచ్చు. ఈ సినిమా కోసం సినీ ప్రియులంతా ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం కరోనా మొదటి దశ, రెండవ దశ కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. అయితే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకొని ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కేవలం రెండు పాటలు మినహా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా చిత్రబృందం ప్రకటించారు.త్వరలోనే ఈ రెండు పాటలు చిత్రీకరణ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించాలని చిత్రబృందం భావిస్తున్నట్లు తెలిపారు.

ఈ చిత్రంలో జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా నటిస్తుండగా అలియాభట్, ఒలివియా మోరీస్‌  హీరోయిన్లుగా సందడి చేయనున్నారు. ఈ సినిమాలో కొమురం భీం పాత్రలో నటిస్తున్నటువంటి ఎన్టీఆర్ తండ్రి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ కీలక పాత్రలో నటించనున్నారు.

పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మించగా, ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని సమకూర్చుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పలు పోస్టర్లు, టీజర్లు ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.త్వరలోనే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుని ఈ ఏడాదిలోనే సినిమాను విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.