Tag Archives: Shri Lakshmi

Rajeev Kanakala: మూడు నెలలు బెడ్ పైనే… మాట రాక కన్నీళ్లు కార్చేది… చెల్లెల్ని తలుచుకొని ఎమోషనల్ అయినా రాజీవ్!

Rajeev Kanakala: రాజీవ్ కనకాల పరిచయం అవసరం లేని పేరు.నటుడిగా యాంకర్ సుమ భర్తగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇక ఈయన నటించే సినిమాలలో తన పాత్ర సినిమాని కీలక మలుపు తిప్పే పాత్రలలో నటిస్తూ ఉంటారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి రాజీవ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన మాట్లాడుతూ తన చెల్లెలు శ్రీలక్ష్మి నీ తలుచుకొని ఎమోషనల్ అయ్యారు.ప్రస్తుతం తనకు అమ్మానాన్న చెల్లి వీరెవరూ లేరని అందరూ మరణించడంతో ఒక్కసారిగా తాను డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని తెలిపారు..తన చెల్లెలు శ్రీ లక్ష్మీ ఎన్నో టీవీ సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను మెప్పించింది అయితే ఆమె సంతోషంగా ఉంది అనుకున్న సమయంలోనే క్యాన్సర్ బారిన పడ్డారని తెలిపారు.

క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకొని అంతా బాగుంది తాను దాదాపు కోలుకుందని అందరం భావించాము తన క్షేమం కోసం పూజలు హోమాలు చేశాము. 85% తనకు క్యాన్సర్ నయమైంది.ఇక ఎలాంటి సమస్య లేదు అనుకున్న తరుణంలో మరోసారి తన ఆరోగ్యం క్షీణించింది. అదే సమయంలోనే పచ్చకామెర్లు కూడా వచ్చాయి కీమో ఇప్పించాలి అన్న కూడా కామెర్లు తగ్గాలని చెప్పారు. ఇక అదే సమయంలో లాక్ డౌన్ కూడా ఉండటంతో తప్పనిసరి పరిస్థితులలో తనని ఇంట్లోనే పెట్టుకున్నామని తెలిపారు..

ఇలా తన చివరి రోజులలో కుటుంబం అంతా కూడా ఒకే చోటే ఉండే వాళ్ళమని రాజీవ్ తెలిపారు.ఆ చెల్లెలు మూడు నెలల పాటు బెడ్ పై కదల లేని స్థితిలో ఉంది నోట వెంట మాటరాదు తనకు స్పృహ వచ్చినప్పుడు అందరిని చూస్తూ కన్నీళ్లు మాత్రమే కార్చేది. తాను నిద్రపోతున్నప్పుడు ఆ బాధను భరిస్తూ మూలుగుతూ ఉండేది.ఇలా మూలుగుతున్నప్పుడు మేము తాను ఇంకా బ్రతికే ఉంది అని అనుకునే వాళ్ళం అంటూ ఈ సందర్భంగా తన చెల్లెలు చివరి రోజులను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు.

Rajeev Kanakala: సుమ అమ్మలేని లోటు తీరుస్తుంది…


ఈ విధంగా శ్రీలక్ష్మి ఎంతో బాధను అనుభవించి మరణించిందని రాజీవ్ కనకాల తెలియజేశారు. అయితే తన ఇద్దరు మేనకోడళ్ళు చాలా స్ట్రాంగ్ అని ఈయన తెలిపారు. శ్రీలక్ష్మి మరణించిన తర్వాత సుమ నాకు నలుగురు పిల్లలు అంటూ ఆ ఇద్దరి బాధ్యత కూడా తానే తీసుకొని వారికి అమ్మలేని లోటును తీరుస్తుంది అంటూ ఈ సందర్భంగా రాజీవ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Aishwarya Rajesh: వెధవ అంటూ ఆటో డ్రైవర్ పై మండిపడిన నటి ఐశ్వర్య రాజేష్.. పోలీసులకు కృతజ్ఞతలు తెలిపిన నటి!

Aishwarya Rajesh: తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా గడుపుతున్న నటి ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు సీనియర్ నటి శ్రీ లక్ష్మీ మేనకోడలిగా హీరో రాజేష్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఐశ్వర్య రాజేష్ సొంత టాలెంట్ తో ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడిపే ఐశ్వర్య రాజేష్ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. సోషల్ మీడియా వేదికగా నటి ఐశ్వర్య రాజేష్ చెన్నైలో తాజాగా జరిగిన ఊబర్‌ ఆటో డ్రైవర్‌ ఘటనపై స్పందించారు. ఇషిత సింగ్ అనే మహిళ చెన్నైలోని ఏసీజే ఇండియా కాలేజ్‌లో జర్నలిజం కోర్సు చదువుతోంది. ఈ క్రమంలోనే ఇషిత ఈస్ట్‌ కోస్ట్‌ మద్రాస్‌ నుంచి ఐబిస్‌ ఓఎమ్‌ఆర్‌ హోటల్‌కు రావటానికి తన స్నేహితురాలితో కలిసి ఊబర్‌ ఆటో ఎక్కింది.

హోటల్ రాగానే తన స్నేహితురాలు దిగి ఆటో డ్రైవర్ కు డబ్బులు ఇస్తుండగా అనంతరం ఇషిత దిగుతున్న సమయంలో ఆటోడ్రైవర్ తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు.తన ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ అసభ్యంగా ప్రవర్తించడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఇషిత తనపై పోలీసులకు కంప్లైంట్ చేయడంతో ఆటో డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయారు.

Aishwarya Rajesh: ఇలాంటి వెధవలను కఠినంగా శిక్షించాలి..

ఇషిత ఇచ్చిన కంప్లైంట్ తీసుకున్న పోలీసులు అరగంటలో సంఘటన స్థలానికి చేరుకొని మరుసటి రోజు ఆటో డ్రైవర్ ను అరెస్టు చేశారు. ఈ ఘటనపై నటి ఐశ్వర్య రాజేష్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఇలాంటి వెధవలను అస్సలు వదిలిపెట్టకూడదు కఠినంగా శిక్షించాలి అంటూ ఆటో డ్రైవర్ పై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా వెంటనే స్పందించి అతనిని అరెస్టు చేసినందుకు పోలీసులకు ఈమె కృతజ్ఞతలు తెలియజేశారు.