Rajeev Kanakala: రాజీవ్ కనకాల పరిచయం అవసరం లేని పేరు.నటుడిగా యాంకర్ సుమ భర్తగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇక ఈయన నటించే సినిమాలలో తన పాత్ర సినిమాని కీలక మలుపు తిప్పే పాత్రలలో నటిస్తూ ఉంటారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి రాజీవ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన మాట్లాడుతూ తన చెల్లెలు శ్రీలక్ష్మి నీ తలుచుకొని ఎమోషనల్ అయ్యారు.ప్రస్తుతం తనకు అమ్మానాన్న చెల్లి వీరెవరూ లేరని అందరూ మరణించడంతో ఒక్కసారిగా తాను డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని తెలిపారు..తన చెల్లెలు శ్రీ లక్ష్మీ ఎన్నో టీవీ సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను మెప్పించింది అయితే ఆమె సంతోషంగా ఉంది అనుకున్న సమయంలోనే క్యాన్సర్ బారిన పడ్డారని తెలిపారు.
క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకొని అంతా బాగుంది తాను దాదాపు కోలుకుందని అందరం భావించాము తన క్షేమం కోసం పూజలు హోమాలు చేశాము. 85% తనకు క్యాన్సర్ నయమైంది.ఇక ఎలాంటి సమస్య లేదు అనుకున్న తరుణంలో మరోసారి తన ఆరోగ్యం క్షీణించింది. అదే సమయంలోనే పచ్చకామెర్లు కూడా వచ్చాయి కీమో ఇప్పించాలి అన్న కూడా కామెర్లు తగ్గాలని చెప్పారు. ఇక అదే సమయంలో లాక్ డౌన్ కూడా ఉండటంతో తప్పనిసరి పరిస్థితులలో తనని ఇంట్లోనే పెట్టుకున్నామని తెలిపారు..
ఇలా తన చివరి రోజులలో కుటుంబం అంతా కూడా ఒకే చోటే ఉండే వాళ్ళమని రాజీవ్ తెలిపారు.ఆ చెల్లెలు మూడు నెలల పాటు బెడ్ పై కదల లేని స్థితిలో ఉంది నోట వెంట మాటరాదు తనకు స్పృహ వచ్చినప్పుడు అందరిని చూస్తూ కన్నీళ్లు మాత్రమే కార్చేది. తాను నిద్రపోతున్నప్పుడు ఆ బాధను భరిస్తూ మూలుగుతూ ఉండేది.ఇలా మూలుగుతున్నప్పుడు మేము తాను ఇంకా బ్రతికే ఉంది అని అనుకునే వాళ్ళం అంటూ ఈ సందర్భంగా తన చెల్లెలు చివరి రోజులను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు.
ఈ విధంగా శ్రీలక్ష్మి ఎంతో బాధను అనుభవించి మరణించిందని రాజీవ్ కనకాల తెలియజేశారు. అయితే తన ఇద్దరు మేనకోడళ్ళు చాలా స్ట్రాంగ్ అని ఈయన తెలిపారు. శ్రీలక్ష్మి మరణించిన తర్వాత సుమ నాకు నలుగురు పిల్లలు అంటూ ఆ ఇద్దరి బాధ్యత కూడా తానే తీసుకొని వారికి అమ్మలేని లోటును తీరుస్తుంది అంటూ ఈ సందర్భంగా రాజీవ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…