Tag Archives: simbu

Director Shankar Daughter: ఆ హీరోతో మాత్రం నటించవద్దు..కూతురికి వార్నింగ్ ఇచ్చిన డైరెక్టర్ శంకర్.. ఆ హీరో ఎవరంటే?

Director Shankar Daughter: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోకి స్టార్ హీరో హీరోయిన్ల పిల్లలు అలాగే దర్శక నిర్మాతలు టెక్నీషియన్ పిల్లలు ఇండస్ట్రీలోకి వారసులుగా రావడం మనం చూస్తున్నాము. ఈ క్రమంలోనే ప్రతి ఒక్క భాషలో కూడా మనకు నెపోటిజం కనబడుతూనే ఉంది.ఇకపోతే కోలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర దర్శకుడిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న డైరెక్టర్ శంకర్ గురించి పరిచయం అవసరం లేదు. ఇక ఈయన కుమార్తె అదితి శంకర్ సైతం కార్తి హీరోగా నటించిన విరుమాన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఇక ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మిశ్రమ ఫలితాన్ని అందుకుంది.ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా అతిథి శంకర్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన తండ్రి గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.నిజం చెప్పాలంటే తాను ఇండస్ట్రీలోకి రావడం తన తండ్రికి ఏమాత్రం ఇష్టం లేదని అదితి శంకర్ పేర్కొన్నారు. ఇకపోతే తనకు మాత్రం ఇండస్ట్రీలో కొనసాగడం ఇష్టమని తెలియడంతో తన ఇష్టాన్ని కాదనలేక నాన్న ఇండస్ట్రీలోకి రావడానికి ఒప్పుకున్నారని తెలిపారు.

ఇకపోతే ఇండస్ట్రీలో తను ఏ హీరోతో అయినా కానీ నటించు కానీ ఒక్క హీరోతో మాత్రం నటించవద్దు అంటూ వార్నింగ్ ఇచ్చినట్లు ఈమె తెలిపారు. అయితే శంకర్ ఈ విధంగా తన కూతురుకు వార్నింగ్ ఇచ్చారని తెలియడంతో ప్రస్తుతం ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారింది. అయితే శంకర్ ఎవరితో తన కూతురు నటించడం ఇష్టం లేదనే విషయానికి వస్తే…

Director Shankar Daughter: శంకర్ కి ఏమాత్రం ఇష్టం లేదా….

కోలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా మంచి పేరు సంపాదించుకున్న నటుడు శింబు సరసన తన కూతురు నటించడానికి శంకర్ ఇష్టపడటం లేదని తెలుస్తోంది. ఇలా ఆయన సరసన నటించడానికి ఇష్టపడకపోవడానికి గల కారణం ఆయనకున్న ప్రేమ వ్యవహారాలే కారణమని తెలుస్తుంది.ఇక శంకర్ ఎంత పెద్ద డైరెక్టర్ అయినప్పటికీ ఒక కూతురికి తండ్రిగా తన కూతురి విషయంలో వ్యవహరించారని పలువురు భావిస్తున్నారు. మొత్తానికి శంకర్ కుమార్తె ఆదితి శంకర్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

కొందరు కావాలనే నన్ను టార్గెట్ చేశారు… ఎమోషనల్ అయిన హీరో శింబు!

తమిళ హీరోగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న శింబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నో చిత్రాల ద్వారా విశేష ఆదరణ సంపాదించుకున్న శింబు తాజాగా వెంకటేష్ ప్రభు దర్శకత్వంలో శింబు హీరోగా మానాడు అనే చిత్రంలో నటించారు. ఈ సినిమా నవంబర్ 25 వ తేదీ విడుదల కావడంతో మేకర్స్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

ఈ క్రమంలోనే హీరో శింబు మాట్లాడుతూ సినిమా విశేషాలను పంచుకున్నారు. వెంకటేష్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాం అని అయితే మానాడు చిత్రం ద్వారా మా ఇద్దరి కాంబినేషన్లో సినిమా కుదిరిందని శింబు వెల్లడించారు. ఈ సినిమా ఈ నెల 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇందులో ప్రేక్షకులకు కావాల్సినంత వినోదం ఉందని ఈ సినిమా తప్పకుండా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అంటూ తెలిపిన శింబు ఉన్నఫలంగా కన్నీటి పర్యంతమయ్యారు. కొందరు నన్ను కావాలనే టార్గెట్ చేసి నన్ను ఎంతో ఇబ్బందులకు గురి చేస్తున్నారు అంటూ ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఇలా చెబుతూ శింబు ఎమోషనల్ కాగా అతనిని అక్కడే ఉన్నటువంటి పలువురు ఓదార్చారు.

అయినా ఆ సమస్యల గురించి నేను చూసుకుంటాను నా సంగతి మీరు చూడండి అంటూ ప్రేక్షకులను ఉద్దేశిస్తూ మాట్లాడారు. శింబు ఇలా ఎమోషనల్ కావడంతో వేదికపై ఉన్నటువంటి భారతీరాజా, ఎస్ఏ చంద్రశేఖర్, ఎస్‌జే సూర్య, నిర్మాత కె.రాజన్ తదితరులు అతనిని ఓదార్చారు.