తమిళ హీరోగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న శింబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నో చిత్రాల ద్వారా విశేష ఆదరణ సంపాదించుకున్న శింబు తాజాగా వెంకటేష్ ప్రభు దర్శకత్వంలో శింబు హీరోగా మానాడు అనే చిత్రంలో నటించారు. ఈ సినిమా నవంబర్ 25 వ తేదీ విడుదల కావడంతో మేకర్స్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
ఈ క్రమంలోనే హీరో శింబు మాట్లాడుతూ సినిమా విశేషాలను పంచుకున్నారు. వెంకటేష్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాం అని అయితే మానాడు చిత్రం ద్వారా మా ఇద్దరి కాంబినేషన్లో సినిమా కుదిరిందని శింబు వెల్లడించారు. ఈ సినిమా ఈ నెల 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇందులో ప్రేక్షకులకు కావాల్సినంత వినోదం ఉందని ఈ సినిమా తప్పకుండా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అంటూ తెలిపిన శింబు ఉన్నఫలంగా కన్నీటి పర్యంతమయ్యారు. కొందరు నన్ను కావాలనే టార్గెట్ చేసి నన్ను ఎంతో ఇబ్బందులకు గురి చేస్తున్నారు అంటూ ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఇలా చెబుతూ శింబు ఎమోషనల్ కాగా అతనిని అక్కడే ఉన్నటువంటి పలువురు ఓదార్చారు.
అయినా ఆ సమస్యల గురించి నేను చూసుకుంటాను నా సంగతి మీరు చూడండి అంటూ ప్రేక్షకులను ఉద్దేశిస్తూ మాట్లాడారు. శింబు ఇలా ఎమోషనల్ కావడంతో వేదికపై ఉన్నటువంటి భారతీరాజా, ఎస్ఏ చంద్రశేఖర్, ఎస్జే సూర్య, నిర్మాత కె.రాజన్ తదితరులు అతనిని ఓదార్చారు.
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…