Tag Archives: sri devi

Yandamuri Veerendranath: ఆ రోజుల్లో కమల్ హాసన్ శ్రీదేవి రెమ్యూనరేషన్ 2 లక్షలే… చిరంజీవికి కూడా లాభాల్లో…

Yandamuri Veerendranath: యండమూరి వీరేంద్రనాథ్ ఒక రచయితగా, వ్యక్తిత్వ వికాస బోధకుడిగా అందరికీ సుపరిచితమే. ఇలా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న యండమూరి ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలలో పాల్గొని సినీ ఇండస్ట్రీ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయనకు రెమ్యునరేషన్ గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.

Yandamuri Veerendranath: ఆ రోజుల్లో కమల్ హాసన్ శ్రీదేవి రెమ్యూనరేషన్ 2 లక్షలే… చిరంజీవికి ఎంతంటే?

ప్రస్తుత కాలంలో రచయిత కైనా, దర్శకుడైనా హీరోయిన్లకైనా సినిమా లాభాలలో వాటా తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే అప్పట్లో మీరు కూడా సినిమా లాభాలలో వాటా తీసుకునేవారా అని ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు యండమూరి సమాధానం చెబుతూ అప్పట్లో ఇలాంటి వాటాలు అనేది ఏమీ లేవు కేవలం రెమ్యూనరేషన్ మాత్రమే ఉండేదని తెలియజేశారు.

Yandamuri Veerendranath: ఆ రోజుల్లో కమల్ హాసన్ శ్రీదేవి రెమ్యూనరేషన్ 2 లక్షలే… చిరంజీవికి ఎంతంటే?

తాను అభిలాష సినిమాకు పని చేసినందుకు గాను పాతిక వేలు ఇచ్చారని అలాగే స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ సినిమాకి డైలాగ్ రైటర్, స్క్రిప్ట్ స్క్రీన్ప్లే అందించినందుకు నాకు రెండు లక్షల యాభై వేల రూపాయల పారితోషికం ఇచ్చారు. అప్పట్లో ఎలాంటి వాటాలు లేవని ఈ సందర్భంగా యండమూరి వెల్లడించారు.

అందరికీ రెమ్యూనరేషన్ ఇచ్చేవాళ్ళు…

ఇకపోతే అప్పట్లో రెమ్యూనరేషన్ కూడా చాలా తక్కువగా ఉండేవి అయితే ఆ సమయానికి అతి పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ అంటూ యండమూరి వెల్లడించారు. ఒక రాధ ఇద్దరు కృష్ణులు సినిమాకు కమల్ హాసన్, శ్రీదేవి రెండు లక్షల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారని ఈ సందర్భంగా యండమూరి తెలిపారు. అప్పట్లో ప్రతి ఒక్కరికి రెమ్యూనరేషన్ ఇచ్చే వాళ్ళని ఎవ్వరికీ వాటాలు లేవని వెల్లడించారు. ఇక మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడుతూ ఆయన కూడా సినిమాకు రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకునేవారని ఎలాంటి లాభాలలో భాగం ఉండేది కాదని ఈ సందర్భంగా తెలిపారు.

Chiranjeevi: అంత జ్వరంలో కూడా శ్రీదేవితో కలిసి డాన్స్ చేశా… మేడే సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేసిన మెగా స్టార్!

Chiranjeevi:మెగాస్టార్ చిరంజీవి ఒక సామాన్య కుటుంబంలో జన్మించి స్వయంకృషితో ఇండస్ట్రీలో అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు మెగాస్టార్ రేంజ్ కి వెళ్ళారు. అయితే ఈయన మెగా స్టార్ అవ్వడం వెనుక ఎంతో కష్టం, శ్రమ దాగి ఉన్నాయని మెగాస్టార్ ఎన్నోసార్లు వెల్లడించారు.తాజాగా మే డే కార్మికుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని యూసఫ్ గూడలో నిర్మించిన సినీ కార్మిక కార్యక్రమంలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

Chiranjeevi: అంత జ్వరంలో కూడా శ్రీదేవితో కలిసి డాన్స్ చేశా… మేడే సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేసిన మెగా స్టార్!

ఈ సందర్భంగా మెగాస్టార్ మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఇక జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా షూటింగ్ సమయంలో జరిగిన సంఘటన గురించి ఈ సందర్భంగా మెగాస్టార్ బయటపెట్టారు.ఈ సినిమా షూటింగ్ సమయంలో శ్రీదేవితో కలిసి ఒక డాన్స్ చేయాల్సి ఉంది అయితే ఆ సమయంలో 103 డిగ్రీల జ్వరంతో బాధ పడుతున్నాను. అయినా వాటిని లెక్కచేయకుండా డాన్స్ చేశానని మెగాస్టార్ ఈ సందర్భంగా వెల్లడించారు.

Chiranjeevi: అంత జ్వరంలో కూడా శ్రీదేవితో కలిసి డాన్స్ చేశా… మేడే సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేసిన మెగా స్టార్!

ఇప్పుడు కూడా గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ కోసం ముంబై వెళ్లాలి, మైత్రి మూవీ కోసం హైదరాబాద్ రావాలి.ఇలా నిత్యం షూటింగుల కోసం తిరగాల్సి వచ్చి ఎంతో అలసిపోతున్నాను. అయితే నేను అలసిపోయానని చెబితే ఆ రోజు షూటింగ్ క్యాన్సిల్ చేస్తారు.నా ఒక్కడి వల్ల షూటింగ్ క్యాన్సిల్ అయితే ఎంతో మంది ఆర్టిస్టులు టెక్నీషియన్ల ఇబ్బంది పడాల్సి ఉంటుంది.

చిరునవ్వుతో షూటింగ్ లో పాల్గొనే వారు…

ముఖ్యంగా నిర్మాతలు ఎంతో నష్ట పోవాల్సి ఉంటుంది కనుక వీటన్నింటిని బయటకు చెప్పకుండా తన పని తాను చేసుకుపోయే వాడినని మెగాస్టార్ ఈ సందర్భంగా వెల్లడించారు.కేవలం నేను మాత్రమే కాకుండా అప్పట్లో ప్రతి ఒక్కరు కూడా ఇలా సినిమాకి అధిక ప్రాధాన్యత ఇచ్చి ఎన్ని కష్టాలు ఉన్న చిరునవ్వుతో షూటింగ్లో పాల్గొనేవారని, ఈ సందర్భంగా మెగాస్టార్ వెల్లడించారు.కార్మిక దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Yendamuri : ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమాలో చిరంజీవిని చంద్రమండలంలోకి పంపుదామన్నారు.. అప్పుడు చిరంజీవి మాటలకి మొత్తం రివర్స్..

Yendamuri Veerendranath: సినీ రచయితగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న యండమూరి వీరేంద్రనాథ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి సినిమాల గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ సినీ కెరీర్లో ఎంతో మంచి విజయాన్ని అందుకున్న సినిమాలలో జగదేక వీరుడు అతిలోక సుందరి ఒకటి. ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే.

ఇక తాజాగా యండమూరి వీరేంద్రనాథ్ ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఈ సినిమా ఒక్కొక్కరి నుంచి ఒక్కో ఆలోచన తీసుకొని తెరకెక్కించాము. ఇలా అందరి ఆలోచనలు కరెక్ట్ గా వర్కౌట్ కావడంతో ఈ సినిమా మంచి విజయం అందుకుందని యండమూరి ఈ సందర్భంగా వెల్లడించారు.

ముఖ్యంగా ఈ సినిమాలో చిరంజీవి శ్రీదేవి కలుసుకునే సన్నివేశం కోసం పెద్ద చర్చ జరిగింది. చిరంజీవి దగ్గర నలుగురు పిల్లలు ఉంటారు. వీరిలో ఒక అమ్మాయికి వైద్యం చేయించడం కోసం డబ్బు అవసరమవుతుంది. అయితే అప్పట్లో చంద్రమండలంలోకి వెళ్లే వారికి డబ్బులు ఇస్తామని ప్రకటిస్తారు. చిరంజీవిని చంద్రమండలంలోకి పంపించి అక్కడ శ్రీదేవి చిరంజీవిని కలపాలని ప్లాన్ చేశారు.

హిమాలయాలలో కలుసుకోవడం…

ఇక ఈ విషయంపై చిరంజీవి తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ చంద్రమండలంలోకి వెళ్లి హీరోయిని కలుసుకోవడం ఏంటి? చంద్ర మండలంలో రాళ్ళు రప్పలు తప్ప ఇంకేం ఉంటాయి అక్కడ కలుసుకోవడం ఏంటి? మూలికల కోసం హిమాలయాలకు వెళ్ళినపుడు అక్కడ కలుసుకొనేలా ఉంటే బాగుంటుందని చిరంజీవి గారు చెప్పారు. ఇక ఆ మాట విన్న రాఘవేంద్రరావు ఈ ఆలోచన బాగుందని, అదే సీన్ పెట్టారని, యండమూరి ఈ సందర్భంగా జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా గురించి ఈ విషయాన్ని బయటపెట్టారు.