Chiranjeevi: అంత జ్వరంలో కూడా శ్రీదేవితో కలిసి డాన్స్ చేశా… మేడే సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేసిన మెగా స్టార్!
Chiranjeevi:మెగాస్టార్ చిరంజీవి ఒక సామాన్య కుటుంబంలో జన్మించి స్వయంకృషితో ఇండస్ట్రీలో అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు మెగాస్టార్ రేంజ్ కి వెళ్ళారు. అయితే ఈయన మెగా స్టార్ అవ్వడం వెనుక ఎంతో కష్టం, శ్రమ దాగి ఉన్నాయని మెగాస్టార్ ఎన్నోసార్లు వెల్లడించారు.తాజాగా మే డే కార్మికుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని యూసఫ్ గూడలో నిర్మించిన సినీ కార్మిక కార్యక్రమంలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మెగాస్టార్ మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఇక జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా షూటింగ్ సమయంలో జరిగిన సంఘటన గురించి ఈ సందర్భంగా మెగాస్టార్ బయటపెట్టారు.ఈ సినిమా షూటింగ్ సమయంలో శ్రీదేవితో కలిసి ఒక డాన్స్ చేయాల్సి ఉంది అయితే ఆ సమయంలో 103 డిగ్రీల జ్వరంతో బాధ పడుతున్నాను. అయినా వాటిని లెక్కచేయకుండా డాన్స్ చేశానని మెగాస్టార్ ఈ సందర్భంగా వెల్లడించారు.
ఇప్పుడు కూడా గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ కోసం ముంబై వెళ్లాలి, మైత్రి మూవీ కోసం హైదరాబాద్ రావాలి.ఇలా నిత్యం షూటింగుల కోసం తిరగాల్సి వచ్చి ఎంతో అలసిపోతున్నాను. అయితే నేను అలసిపోయానని చెబితే ఆ రోజు షూటింగ్ క్యాన్సిల్ చేస్తారు.నా ఒక్కడి వల్ల షూటింగ్ క్యాన్సిల్ అయితే ఎంతో మంది ఆర్టిస్టులు టెక్నీషియన్ల ఇబ్బంది పడాల్సి ఉంటుంది.
ముఖ్యంగా నిర్మాతలు ఎంతో నష్ట పోవాల్సి ఉంటుంది కనుక వీటన్నింటిని బయటకు చెప్పకుండా తన పని తాను చేసుకుపోయే వాడినని మెగాస్టార్ ఈ సందర్భంగా వెల్లడించారు.కేవలం నేను మాత్రమే కాకుండా అప్పట్లో ప్రతి ఒక్కరు కూడా ఇలా సినిమాకి అధిక ప్రాధాన్యత ఇచ్చి ఎన్ని కష్టాలు ఉన్న చిరునవ్వుతో షూటింగ్లో పాల్గొనేవారని, ఈ సందర్భంగా మెగాస్టార్ వెల్లడించారు.కార్మిక దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…