Tag Archives: sundeep kishan

Sundeep Kishan: రెజినాతో లవ్ గురించి ఓపెన్ అయిన సందీప్ కిషన్… ఏమన్నారంటే?

Sundeep Kishan: సాధారణంగా రెండు మూడు సినిమాలలో ఒకే జంట కలిసి నటిస్తే వారి గురించి పెద్ద ఎత్తున వార్తలు రావడం సర్వసాధారణం. ఇలా ఎంతోమంది సెలబ్రిటీలు ఒకే సినిమాలో కలిసిన నటించడం వల్ల వారి మధ్య ఏదో ఉందంటూ పెద్ద ఎత్తున వార్తలను సృష్టించారు.ఈ క్రమంలోనే నటుడు సందీప్ కిషన్ నటి రెజీనా మధ్య కూడా ఇలాంటి సంబంధమే ఉందంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వచ్చాయి.

రెజీనా సందీప్ కిషన్ ఇద్దరూ కలిసి నాలుగు సినిమాలలో నటించారు. దీంతో వీరిద్దరూ లవ్ లో ఉన్నారని కోలీవుడ్ మీడియా కోడై కూసింది. అదేవిధంగా రెజినా పుట్టినరోజు సందర్భంగా సందీప్ తనతో ఎంతో చనువుగా ఉన్నటువంటి ఫోటోని షేర్ చేస్తూ హ్యాపీ బర్త్ డే పాప ఐ లవ్ యు.. అంతా మంచే జరగాలి అంటూ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ విధంగా రెజీనా సందీప్ కిషన్ మధ్య ఏదో ఉందంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా మైకెల్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సందీప్ కిషన్ ఈ వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చారు.ఈ సందర్భంగా సందీప్ కిషన్ మాట్లాడుతూ మేము నాలుగు సినిమాలలో కలిసిన నటించాము. మా ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ తప్ప ఎలాంటి రిలేషన్ లేదని తెలిపారు.

Sundeep Kishan: రెజీనా తనకు ఒక ఫ్యామిలీ మెంబర్..

రెజీనా తనకు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా.. తాను ఏదైనా పని నిమిత్తం ముంబై వచ్చిన ప్రతిసారి తన సోదరి గదిలోనే ఉంటుందని తెలిపారు. అయితే మా ఇద్దరి మధ్య ఏమీ లేదని చెబితే మీకు చాలా బోర్ గా అనిపిస్తుంది. అందుకే మా గురించి ఇలాంటి వార్తలు వస్తున్నాయని,ఆ వార్తలలో ఏ మాత్రం నిజం లేదని తను నేను మంచి స్నేహితులు మాత్రమేనని ఈ సందర్భంగా రెజీనాతో తనకు ఉన్న రిలేషన్ గురించి సందీప్ కిషన్ బయటపెట్టారు.

తనకు లైఫ్ ఇచ్చింది కూడా ఆ దర్శకులే.. హీరో సందీప్ కిషన్..

సన్నీ నవీన్‌, సీమా చౌదరి, సమ్మోహిత్‌ ప్రధాన పాత్రల్లో జయ కిషోర్‌ బండి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మధుర వైన్స్‌’. ఎస్ ఒరిజినల్స్, ఆర్.కె.సినీ టాకీస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజేష్‌ కొండెపు, సృజన్‌ యారబోలు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈనెల 22న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి వస్తున్న సందర్భంగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు.

కథానాయకుడు సందీప్‌కిషన్‌, దర్శకులు బుచ్చిబాబు సానా, కిషోర్‌, నిర్మాత వివేక్‌ కూచిభొట్ల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చిత్ర యూనిట్ కు బెస్ట్ విషేష్ తెలియజేశారు. ఈ సందర్భంగా దర్శకుడు జయకిషోర్ మాట్లాడుతూ.. తన సినిమా కొవిడ్‌ కారణంగా ఆలస్యం కాలేదని.. ఒక సాంకేతిక నిపుణుడి దగ్గర ఎనిమిది నెలలు ఆగిపోయిందని.. ప్రస్తుతం అన్ని అడ్డంకుల్ని దాటుకుని ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం అన్నారు.

మధురానుభూతుల్ని పంచుతూ, అందరినీ మెప్పిస్తుంది అని చెప్పారు. ఈ సినిమా కచ్చితంగా అందరికీ నచ్చుతుందని అన్నారు. ఈ సందర్భంగా హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. “ చిత్ర బృందమంతా షార్ట్ ఫిల్మ్‌ల నుండి వచ్చినా చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. సినిమా గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ”అని తెలిపారు.

తనకు హీరోగా లైఫ్ ఇచ్చింది కూడా షార్ట్ ఫిల్మ్ దర్శకులే.. ఈ సినిమ కూడా కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం ఉందన్నారు. ఇక తాను హీరోగా పరిచయం అవుతున్న మొదటి సినిమా ఇది అంటూ సన్నీ పేర్కొన్నాడు. ఇతకు ముందే ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.