Tag Archives: Telugu Actress

Actress Sudha:ఆ టైమ్ లో వాళ్ళంతా నన్ను దూరం పెట్టారంటూ కన్నీరు పెట్టుకున్న నటి సుధ… కారణం అదేనా ?

Actress Sudha:టాలీవుడ్ లో వెయ్యికి పైగా చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన సుధ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె నటన చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే… బాలనటిగా అలరించిన ఆమె పద్నాలుగేళ్ల వయసులోనే హీరోయిన్‌గానూ మారింది. తల్లీ, అత్త, అక్క ఇలా అన్ని పాత్రల్లో అలవోకగా నటించి ప్రేక్షకులను అలరించింది సుధా. అలాగే ఈమె వెండి తెరపైనే కాకుండా బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించి… ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ఆమె సినీ కెరీర్ ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గానే కొనసాగుతుంది. అయితే ఈమె అప్పుడప్పుడు పలు యూట్యూబ్ ఛానల్స్ కు ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి మనసు లోని మాటలని బయటపెట్టింది.

Actress Sudha:ఆ టైమ్ లో వాళ్ళంతా నన్ను దూరం పెట్టారంటూ కన్నీరు పెట్టుకున్న నటి సుధ… కారణం అదేనా ?

తాజాగా ఆమె తన జీవితంలోని ఒడిదుడుకులను కళ్లకు కట్టినట్లు వివరించింది. ‘ఇన్నేళ్ల కెరీర్‌లో చాలా సంపాదించుకున్నాను, కానీ బిజినెస్‌లు పెట్టి ఉన్నదంతా పోగొట్టుకున్నాను. ఢిల్లీలో ఒక హోటల్‌ పెట్టినప్పుడు లాభం వస్తే దాంతో మరో హోటల్‌ పెట్టాను. అప్పుడు నష్టాలొచ్చి నిండా మునిగాను. కొన్నాళ్ల పాటు నేను హైదరాబాద్‌లోనే ఉన్నాను. కానీ కుటుంబ సమస్యలు, అమ్మాయి పెళ్లి ఉండటంతో చెన్నైకి మారాల్సి వచ్చింది అని చెప్పారు. చిన్నప్పుడే అమ్మ హార్ట్‌ ఎటాక్‌తో చనిపోయింది. ఆమె పోయిన తర్వాత కొడుకులున్నా నాన్నకు సపోర్ట్‌ లేకుండా పోవడంతో ఆయనని నేనే చూసుకున్నాను.

Actress Sudha:ఆ టైమ్ లో వాళ్ళంతా నన్ను దూరం పెట్టారంటూ కన్నీరు పెట్టుకున్న నటి సుధ… కారణం అదేనా ?

సుధను దూరం పెట్టిన వాళ్ళు వీరేనా…

నాన్నకు బాగానే ఆస్తుపాస్తులు ఉండేవి. కానీ క్యాన్సర్‌ వల్ల అవి అన్నీ ఖర్చు అయిపోయాయి. అమ్మ పోయినప్పుడు కూడా అంత బాధపడలేదు, కానీ నాన్న పోయాక లైఫ్‌ అంటే ఏంటో తెలిసొచ్చింది. నాన్నకు క్యాన్సర్‌ అనగానే బంధువులంతా దూరం పెట్టారు… వీటినుంచి నేను చాలా గుణపాఠాలు నేర్చుకున్నాను. అప్పుడే మనుషుల్ని నమ్మకూడదని అర్థమైంది. నా భర్త, కొడుకులు కూడా నాకు దూరంగా ఎక్కడో యూఎస్‌లో ఉన్నారు. కానీ వాళ్లకూ నాలాంటి పరిస్థితే వస్తుంది. మాతృదేవోభవ సినిమాలోని చాలా సంఘటనలు నా నిజ జీవితంలో జరిగినవే అంటూ కన్నీళ్లు పెట్టుకుంది సుధ.

Jayasudha : ఒకే ఏడాదిలో 25 సినిమాలు.. అందుకే ఆమె సహజ నటి అయింది.!

Jayasudha : సినిమా ఇండస్ట్రీలో నేచురల్ పర్ఫార్మర్ అనిపించుకోవడం అంత ఈజీ కాదు. అది హీరో అయినా హీరోయిన్ అయినా. ఎందుకంటే ఎక్కువశాతం ఇక్కడ కమర్షియల్ చిత్రాలే రూపొందుతుంటాయి. హీరోలు దాదాపుగా అందరు కమర్షియల్ హీరో అనిపించుకునేందుకు ప్రయత్నిస్తే హీరోయిన్స్ మాత్రం గ్లామర్ క్వీన్ అనిపించుకోవడానికి ఆరాటపడుతుంటారు. భానుమతి, సావిత్రి, జమున లాంటి హీరోయిన్స్ వారి తరంలో కథకు మాత్రమే ప్రాధాన్యమిచ్చేవారు. ఆకాలంలో ఎక్కువగా జానపదం, పౌరాణిక చిత్రాలే ఎక్కువగా రూపొందాయి.

ఆ తర్వాత శ్రీదేవి, జనరేషన్‌లో విజయశాంతి, రాధ, సుహాసిని, మాధవి, రాధిక లాంటి వారు హీరోయిన్స్‌గా ఓ వెలుగు వెలిగారు. వీరంతా ఎక్కువగా గ్లామర్ పాత్రలనే చేయడానికి ఆసక్తి చూపించారు. ఎందుకంటే అప్పుడు చిరంజీవి, సుమన్, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణం రాజు, నాగేశ్వర రావు లాంటి వారు ఎక్కువగా కమర్షియల్ సినిమాలు చేసేవారు. వారి పక్కన ఈ హీరోయిన్స్ అందరూ కథా ప్రాధాన్యం ఉన్న సినిమాలతో పాటు గ్లామర్ పాత్రలపైనా ఫోకs పెట్టారు.

అయితే వీరిలో గ్లామర్ రోల్స్ చాలా తక్కువ చేసింది మాత్రం జయసుధనే. ఆమె ఏ హీరో పక్కన నటించిన గ్లామర్ పాత్రలు కాకుండా కథా బలమున్న చిత్రాలను ఎంచుకున్నారు. ఇక ఇంతమంది గ్లామర్ హీరోయిన్స్ మధ్య తన అద్భుతమైన నటనతో సహజ నటి అని విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్నారు. స్క్రీన్ మీద జయసుధ పాత్ర కనిపిస్తే ప్రేక్షకులు చాలా ఎమొషనల్ అయ్యేవారు. అగ్ర దర్శకులకు బెస్ట్ ఛాయిస్‌గా జయసుధ నిలిచారు. అసలు పేరు సుజాత అయితే సినిమా రంగానికి జయసుధగా పరిచయమయ్యారు.

నటి, నిర్మాత విజయనిర్మల జయసుధకు మేనత్త అవుతారు. 1972 లో లక్ష్మీదీపక్ దర్శకత్వంలో వచ్చిన పండంటి కాపురం సినిమా ద్వారా జయసుధ చిత్రపరిశ్రమకు పరిచయం అయ్యారు. ఆమె 300లకు పైగా సినిమాల్లో నటించగా వాటిలో 20 తమిళ సినిమాలు, 8 మలయాళ సినిమాలు, 3 హిందీ సినిమాలు, 1 కన్నడ సినిమా ఉన్నాయి. ఇక దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో దాదాపు 25 సినిమాలు, దర్శక రత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో 27 సినిమాల్లో నటించి అగ్ర స్థానంలో నిలిచారు. అంతేకాదు జయసుధ నటించిన సినిమాలు 25 ఒకే సంవత్సరంలో విడుదలవడం ఇప్పటికీ గొప్ప విశేషంగా చెప్పుకంటారు. ఇక జయసుధను అందరూ నిర్మాతల హీరోయిన్ అని చెప్పుకుంటుంటారు. రెమ్యునరేషన్ పరంగా ఎప్పుడూ నిర్మాతలను ఇబ్బంది పెట్టని నటి అని ఇండస్ట్రీ వర్గాలలో చెప్పుకుంటుంటారు.

నోరుజారి వర్షతో ఉన్న లవ్ ట్రాక్ గురించి బయట పెట్టేసిన ఇమ్మానియేల్..?

తెలుగు బుల్లి తెరపై విశేష ప్రజాదరణ పొందిన షోలలో జబర్దస్త్ ,ఎక్స్ ట్రా జబర్దస్త్ కామెడీ షో లకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎంతో మంది కామెడీ ఆర్టిస్టులను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత జబర్దస్త్ ప్రోగ్రామ్ షో కే దక్కుతుంది.ఈ మధ్యకాలంలో జబర్దస్త్ వేదికపై అద్భుతమైన పర్ఫామెన్స్ తో ప్రేక్షకులకు నవ్వులు పంచుతూ వారి అభిమానాన్ని సొంతం చేసుకున్న నటుడు ఇమాన్యూయేల్ తక్కువ టైం లో ఎక్కువ పాపులర్ అయ్యాడు.

జబర్ధస్త్‌ షోలో బాగా పాపులర్ అయిన వర్ష , ఇమాన్యూయేల్ జంట ప్రస్తుతం బుల్లితెర జంటగా ఫేమస్ కావడంతో బుల్లితెరపై అనేక షోలలో అద్భుత పర్ఫామెన్స్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దీనికితోడు వర్ష ,ఇమాన్యూయేల్ జంటపై నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక విషయం వైరల్ అవుతుండడంతో వీరు చేస్తున్న స్క్రిప్ట్ లు అద్భుతమైన ప్రేక్షకాదరణ పొందడంతో పాటు అధిక రేటింగ్ సొంతం చేసుకున్నాయి.

తాజాగా వచ్చే వారం ప్రసారమయ్యే ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్‌ ప్రోమోలో ఇమాన్యూయేల్, వర్ష జంట స్క్రిప్ట్ లో భాగంగా వర్షను చిత్తు కాగితాలు ఏరుకునే అమ్మాయిలా చూపించారు. స్లమ్‌లో ఉన్న వర్షను చూసిన ఇమాన్యూయేల్ ఇంత అందం పెట్టుకుని ప్లాస్టిక్ పేపర్లు ఏరుతున్నావా…నువ్వు నన్ను నమ్మి నాతో వచ్చేయ్…నిన్ను పెద్ద హీరోయిన్‌ చేస్తా అంటాడు. దానికి బదులుగా వర్ష పిచ్చిదాన్ని సార్ అని బదులిస్తుంది.

వర్ష అన్న ఆ మాటకు ఇమాన్యూయేల్ బదులిస్తూ.. తెలుసమ్మా అందుకే కదా నన్ను ప్రేమిస్తున్నావు అని కామెంట్ చేసి వీరిద్దరి ప్రేమ వ్యవహారం పై ఉన్న సందేహానికి మరింత అనుమానం పెంచాడు. ఇమ్మానియేల్ ఈ విధంగా చెప్పడంతో వీరిద్దరి మధ్య నిజంగానే లవ్ ట్రాక్ నడుస్తోందని ప్రేక్షకులు గట్టిగా నమ్ముతున్నారు. ఈ ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది.