Tag Archives: tirupati

ఇంటి ముందు ఆగిన ఇద్దరు అమ్మాయిలు.. చివరకు ఏం చేశారో తెలుసా..?

అలంకరణ సామగ్రి అంటే అమ్మాయిలకు ఎంతో ఇష్టం. అంతేకాకుండా అందులోనూ నగలు, పూలు, మేకప్ కిట్లు, డ్రెస్సులు అనేవి ఇంకా ఎక్కువగా ఇష్టపడుతుంటారు. వాటి కోసం వేలల్లో ఖర్చు అయినా వెనకాడకుండా కొనేస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం ఓ ఇద్దరు అమ్మాయిలు దొంగలుగా మారారు. వాళ్లు చేసే దొంగతనం ఎంటో తెలిస్తే షాక్ అవుతారు.. వాళ్లు పూలకుండీలను దొంగతనం చేస్తున్నారు.
అవునండి.. మీరు విన్నది నిజమే.. వాళ్లు ఇంటి ముందు ఉంచే పూలకుండీలను మాత్రమే దొంగతనం చేస్తున్నారు. ఇది సీసీఫుటేజీలో చూసి పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని నగరి ప్యాలెస్ కాపౌండ్ లోని ఓ లాయర్ తన ఇంటి ఎదుట సీసీ ఫుటేజి చెక్ చేయగా ఇదంతా తెలిసింది. ఓ స్కూటీపై ఇద్దరు యువతులు వచ్చి ఇంటిముందు ఆగారు. రోడ్డుపై అటు నుంచి ఇటు నుంచి ఎవరైనా వస్తున్నారా.. అని చూశారు.

ఉన్నట్లుండి పూలకుండీని స్కూటీపై పెట్టుకున్నారు. ఓ నిమిషం తర్వాత ఆ పూలకుండీని తీసేసి.. అక్కడ పెట్టి మరో పూలకుండీని స్కూటీపై పెట్టుకొని అక్కడి నుంచి జారుకున్నారు. మొదట వారు తీసిన పూల కుండీ తులసి మొక్కది కాగా.. దానిని మళ్లీ అక్కడ పెట్టేసి కొత్తరకం పూలమొక్కను దొంగిలించినట్లు ఇంటి యజమాని తెలిపారు. మొక్కలు కావాలంటే నర్సరీలో చాలా ఉంటాయి.. అక్కడకు వెళ్లి కొనుక్కోవాలి లేదా.. ఇంటి దగ్గర ఉంటే దాని అంటును కత్తిరించి తెచ్చి నాటుకోవాలి.

కానీ ఇలా దొంగతనం చేయడం ఏంట్రా అని తెలిసిన వారు.. ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ పూలకుండీ మొక్కలకు కూడా సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల మనం ఒక మామిడి చెట్టుకు నలుగురు సెక్యూరిటీ గార్డులను కాపలాగా నియమించినట్లు చూశాం. ఇది మధ్యప్రదేశ్ లో జరిగింది. అలాగే.. పూలకుండీలకు కూడా గార్డులు నియమించాలా అంటూ పలువురు పేర్కొంటున్నారు.

మహిళ గర్భంలో నుంచి శిశువు మాయం.. అసలేం జరిగిందంటే..?

తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో వింత ఘటన చోటు చేసుకుంది. గర్భంలోని శిశువు మాయమైందని ఒక మహిళ ఆస్పత్రి యాజమాన్యంపై ఆరోపణలు చేసింది. మహిళ చేసిన ఆరోపణలు ప్రసూతి ఆస్పత్రిలో కలకలం రేపాయి. పూర్తి వివరాల్లోకి వెళితే తిరుపతి పట్టణంలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు చెందిన శశికళ వచ్చారు. ఆమె గర్భవతి కావడంతో ఆస్పత్రిలో డాక్టర్లతో పరీక్షలు చేయించుకోవడంతో పాటు మందులు వాడారు.

ఈరోజు మరోసారి ఆస్పత్రికి వచ్చిన మహిళ పరీక్షలు చేయించుకోకుండా ఆస్పత్రి సిబ్బంది తన గర్భంలో నుంచి శిశువును మాయం చేశారంటూ వింత ఆరోపణలు చేశారు. తాను ఆస్పత్రికి కాన్పు కోసం వచ్చానని అయితే ఆస్పత్రి సిబ్బంది మాత్రం తన కడుపులో బిడ్డ లేదని చెబుతున్నారని పేర్కొన్నారు. వైద్యులే తన కడుపులోని బిడ్డను మాయం చేశారంటూ సదరు మహిళ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఆస్పత్రి నిర్వాహకులతో తన బిడ్డ గురించి చెప్పాలంటూ మహిళ వాగ్వాదానికి దిగారు. మహిళ చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆస్పత్రి సిబ్బంది అవాక్కయ్యారు. మహిళ ఆస్పత్రి తీరును తప్పు పడుతున్న నేపథ్యంలో ఆస్పత్రి సిబ్బంది అలిపిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో వాస్తవాలు తెలిసే అవకాశం ఉంది. అయితే వైద్యులు ఆ మహిళ గర్భం దాల్చలేదని చెబుతున్నారు.

కడుపులో ఉండే గాలి బుడగలను మహిళ గర్భంగా భావిస్తోందని పేర్కొన్నారు. మహిళ మానసిక స్థితి గురించి కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఈ ఘటన గురించి దర్యాప్తు చేస్తున్నారు.