తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో వింత ఘటన చోటు చేసుకుంది. గర్భంలోని శిశువు మాయమైందని ఒక మహిళ ఆస్పత్రి యాజమాన్యంపై ఆరోపణలు చేసింది. మహిళ చేసిన ఆరోపణలు ప్రసూతి ఆస్పత్రిలో కలకలం రేపాయి. పూర్తి వివరాల్లోకి వెళితే తిరుపతి పట్టణంలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు చెందిన శశికళ వచ్చారు. ఆమె గర్భవతి కావడంతో ఆస్పత్రిలో డాక్టర్లతో పరీక్షలు చేయించుకోవడంతో పాటు మందులు వాడారు.
ఈరోజు మరోసారి ఆస్పత్రికి వచ్చిన మహిళ పరీక్షలు చేయించుకోకుండా ఆస్పత్రి సిబ్బంది తన గర్భంలో నుంచి శిశువును మాయం చేశారంటూ వింత ఆరోపణలు చేశారు. తాను ఆస్పత్రికి కాన్పు కోసం వచ్చానని అయితే ఆస్పత్రి సిబ్బంది మాత్రం తన కడుపులో బిడ్డ లేదని చెబుతున్నారని పేర్కొన్నారు. వైద్యులే తన కడుపులోని బిడ్డను మాయం చేశారంటూ సదరు మహిళ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆస్పత్రి నిర్వాహకులతో తన బిడ్డ గురించి చెప్పాలంటూ మహిళ వాగ్వాదానికి దిగారు. మహిళ చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆస్పత్రి సిబ్బంది అవాక్కయ్యారు. మహిళ ఆస్పత్రి తీరును తప్పు పడుతున్న నేపథ్యంలో ఆస్పత్రి సిబ్బంది అలిపిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో వాస్తవాలు తెలిసే అవకాశం ఉంది. అయితే వైద్యులు ఆ మహిళ గర్భం దాల్చలేదని చెబుతున్నారు.
కడుపులో ఉండే గాలి బుడగలను మహిళ గర్భంగా భావిస్తోందని పేర్కొన్నారు. మహిళ మానసిక స్థితి గురించి కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఈ ఘటన గురించి దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…