Tag Archives: tv actress

Preethi Nigam: ఆ ఊరికి వెళితే నన్ను కొడతామని చెప్పారు… బుల్లితెర నటి ప్రీతినిగమ్ కామెంట్స్ వైరల్!

Preethi Nigam: ఈటీవీలో ప్రసారమైన ఎన్నో సీరియల్స్ లో లేడీ విలన్ గా నటించి ప్రేక్షకులకు దగ్గరైన సీనియర్ నటి ప్రీతి నిగమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఋతురాగాలు సీరియల్ ద్వారా నటిగా అడుగుపెట్టిన ప్రీతి ఆ తర్వాత వరుస సీరియల్స్ లో సినిమాలలో నటిస్తూ నటిగా మంచి గుర్తింపు పొందింది. ఇప్పటికీ సీరియల్స్ లో నటిస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది.

ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రీతి నిగమ్ తన జీవితంలో జరిగిన సంఘటనల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఈ క్రమంలో విలన్ పాత్రలలో నటించటం గురించి ప్రీతినిగమ్ స్పందించింది. ఈ క్రమంలో ప్రీతి నిగమ్ మాట్లాడుతూ.. ” సీరియల్స్ లో అన్ని పాత్రల కన్నా విలన్ పాత్రలో నటించడం చాలా కష్టం అని తెలిపింది . విలన్ పాత్రలలో నటించటం వల్ల ఎదురైన ఇబ్బందుల గురించి మాట్లాడుతూ…” ఒకసారి విజయవాడలో హోటల్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఆఫీస్ బాయ్ నా వైపు ఏదోలా చూశాడు.

అతను అలా చూస్తుంటే మొదట భయపడ్డాను. ఆ తర్వాత ఎందుకలా చూస్తున్నావు అని అతన్ని అడిగితే.. ‘ మీరు ఆ సీరియల్లో చేశారు కదా.. ఇంట్లో మా నానమ్మ రోజు మిమ్మల్ని తిడుతూ ఉంటుంది’ అని చెప్పాడు. ఆ తర్వాత ఒకసారి వైజాగ్ వెళ్లడానికి ట్రైన్ లో ఎక్కినప్పుడు ఒక ఆవిడ దగ్గరకు వచ్చి’ మీరు మా ఊరు రావద్దండి. అక్కడికి వస్తే మా వాళ్ళు మిమ్మల్ని కొడతారు ‘ అని చెప్పింది అంటూ ప్రీతి తెలిపింది.

Preethi Nigam:ప్రేక్షకులు వార్నింగ్ ఇచ్చేవారు…

ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు నా పాత్ర వారికి అంతగా కనెక్ట్ అయ్యిందని సంతోషించేదాన్ని అంటూ ప్రీతి తెలిపింది. ఇక ప్రీతి నటించిన కావ్యాంజలి సీరియల్ లోని తన పాత్రకు నేషనల్ అవార్డు కూడా దక్కించుకుంది. అలాగే తన భర్త, కుమారుడి గురించి కూడా ఈ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తనకోసం, తన కొడుకు కోసం భర్త ఉద్యోగం వదులుకున్నాడని తెలిపింది.

Actress Jyothi Reddy: ఈ బుల్లితెర నటి సీఎం మనవరాలని మీకు తెలుసా… ఈమె బ్యాక్గ్రౌండ్ మామూలుగా లేదుగా?

Actress Jyothi Reddy: బాల నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పటికిపలు సినిమాలో సీరియల్స్ లో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో బుల్లితెర నటి జ్యోతి రెడ్డి ఒకరు. ఇలా తొమ్మిదవ ఏట ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె ఇప్పటికే పలు బుల్లితెర సీరియల్స్ అలాగే వెండితెరపై కూడా సినిమాలలో నటిస్తూ ఉన్నారు.

ఇలా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న జ్యోతి రెడ్డి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె తన వ్యక్తిగత విషయాల గురించి వెల్లడించారు. ఈ సందర్భంగా జ్యోతి రెడ్డి మాట్లాడుతూ తాను ఏపీ మాజీ ముఖ్యమంత్రి మనవరాలు అంటూ తెలియజేశారు.

ఆంధ్ర ప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి భవనం వెంకట్రామిరెడ్డి మనవరాలే జ్యోతి రెడ్డి. ఇలా 9వ ఏటా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నారు. ఇక తనకు తన కుటుంబం అంటే ఎంతో గౌరవం ప్రాణమని తెలిపారు. అందుకే తన కుటుంబానికి సంబంధించిన వారి పేర్లను పచ్చబొట్టుగా వేయించుకున్నానని తెలియజేశారు.

Actress Jyothi Reddy:అమ్మ వల్లే ఇండస్ట్రీలోకి వచ్చాను…

ఇక చదువుకుంటున్న సమయంలో తాను డిగ్రీ, ఎంఏ, ఎంఫీల్ ఇలా వరుసగా మూడుసార్లు గోల్డ్ మెడల్ అందుకున్నానని తెలిపారు. ఇక తనకు చదవంటే ఎంతో ఇష్టం మంచి ఉద్యోగం చేయాలని కూడా కోరికగా ఉంది కానీ నా ఇంటి ముందు ఎంతో మంది డైరెక్టర్ల పిఏలు తమ ప్రాజెక్టులో నటించమని ఇంటి ముందు క్యూ కట్టేవారని, వారిని చూసి మా అమ్మ ఇంత పెద్ద వాళ్ళు నీకోసం వస్తే నటించను అంటావేంటి అంటూ ఇండస్ట్రీలోకి రావడానికి ప్రోత్సహించిందని తెలిపారు. ఇలా అమ్మ వల్లే తాను ఇండస్ట్రీలోకి వచ్చానని ఇక తన భర్త సాఫ్ట్వేర్ కాగా, తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని వాళ్ళను అమ్మ చూసుకుంటుందని తెలిపారు.

కార్తీకదీపం సౌందర్య చేసిన మొదటిపాత్ర ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే..?

స్టార్ మా ఛానెల్ లో ప్రసారమయ్యే కార్తీకదీపం సీరియల్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సీరియల్ లోని వంటలక్క, డాక్టర్ బాబు, సౌందర్య, హిమ, శౌర్య పాత్రలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఏళ్లు గడుస్తున్నా ఈ సీరియల్ రికార్డు స్థాయిలో టీఆర్పీ రేటింగ్ లను సొంతం చేసుకుంటూ స్టార్ మా ఛానెల్ ను నంబర్ 1 స్థానంలో నిలుపుతోంది.

ఈ సీరియల్ లో అత్త సౌందర్య పాత్రలో నటించిన అర్చనా అనంత్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు సుపరిచితం. వయస్సు తక్కువే అయినా తల్లి, వదిన తరహా పాత్రల్లో ఆమె ఎక్కువగా నటిస్తున్నారు. ప్యాషన్ డిజైనర్ గా కెరీర్ ను ప్రారంభించిన అర్చన అనంత్ ఊహించని విధంగా నటిగా వరుస అవకాశాలు దక్కించుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంటున్నారు. స్టార్ మా ఛానెల్ లో కార్తీకదీపం సీరియల్ తో పాటు కేరాఫ్ అనసూయ అనే మరో సీరియల్ లో కూడా ఆమె నటిస్తున్నారు.

అయితే అర్చనా అనంత్ చేసిన మొదటి పాత్ర గురించి తెలిస్తే మాత్రం అవాక్కవ్వాల్సిందే. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అర్చన నటిగా మారడానికి గల కారణాలను వెల్లడించారు. ఫ్యాషన్ డిజైనర్ గా పని చేస్తున్న సమయంలో ఒక కన్నడ ప్రాజెక్ట్ కోసం అడిషన్ ఇవ్వమని కోరారని.. అడిషన్ లో పాల్గొంటే ఊహించని విధంగా పాత్రకు ఎంపికయ్యానని అన్నారు. అందరూ చెబితే నవ్వుతారు కానీ తన తొలి పాత్ర శవంలా పడుకునే పాత్ర అని తెలిపారు.

ఆ ప్రాజెక్ట్ కెమెరామెన్ తన తండ్రికి స్నేహితుడని అందువల్ల తానేం మాట్లాడలేకపోయానని అన్నారు. అలా నటనా ప్రయాణం ప్రారంభమైందని.. తెలుగులో పాటు కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో కూడా చేశానని ఆమె చెప్పారు.