Tag Archives: Twitter platform

Anasuya: నాకు సంబంధం లేని విషయాలలో కూడా నా పేరు ఉపయోగిస్తారు… సంచలనమైన ట్వీట్ చేసిన అనసూయ!

Anasuya: అనసూయ ఈమధ్య కాలంలో కాస్త వివాదాలను తగ్గించింది అనుకోనే లోపు మరో వివాదానికి తెర లేపారు. అనసూయ జబర్దస్త్ యాంకర్ గా కొనసాగుతున్న సమయం నుంచి భారీ స్థాయిలో ట్రోల్స్ ఎదుర్కొంటూ నేటిజన్ల విమర్శలకు కారణమవుతున్నారు. ఇలా తరచూ ఏదో ఒక విషయం ద్వారా ఈమె సోషల్ మీడియా వేదికగా వివాదానికి కారణం అవుతూ ఉండేవారు.

ఇలా పలు వివాదాల ద్వారా వార్తలలో నిలిచినటువంటి అనసూయ విజయ్ దేవరకొండతో ఏర్పడినటువంటి వివాదం ద్వారా సంచలనంగా మారారు. అయితే విజయ్ ఫ్యాన్స్ అదే స్థాయిలో ఈమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దీంతో విసిగిపోయిన ఈమె తాను ఈ వివాదానికి ముగింపు పలుకుతున్నానని తెలియజేశారు. ఇలా విజయ్ వివాదానికి చెక్ పెట్టినటువంటి ఈమె అనంతరం సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ పెద్దగా పట్టించుకోలేదు.

ఇకపోతే తాజాగా మరోసారి ట్విట్టర్ వేదికగా ఈమె చేసినటువంటి ట్వీట్ కనక చూస్తే అనసూయ మరో వివాదానికి తెర లేపారు. అందుకే ఇలాంటి పోస్ట్ చేశారని పలువురు భావిస్తున్నారు.ఇంతకీ అనసూయ ట్విట్టర్ వేదికగా ఎవరిని ఉద్దేశించి ఎలాంటి పోస్ట్ చేశారనే విషయానికి వస్తే… ఈమె చేసినటువంటి ఈ ట్వీట్ లో ఎక్కడా కూడాఎవరి పేరు ప్రస్తావించలేదు కానీ ఈమె చేసిన ట్వీట్ మాత్రం వివాదానికి కారణం అవుతుందని తెలుస్తుంది.

Anasuya: నా పేరు లేకుండా ఏది చెప్పలేకపోతున్నారు..


ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా స్పందించిన అనసూయ.. వావ్ నేను వాళ్లకు చాలా ముఖ్యం నా ప్రమేయం ఉన్నా లేకున్నా..నాకు సంబంధం ఉన్న లేకపోయినా నా పేరును ఉపయోగిస్తూ ఉంటారు. నా పేరు లేకుండా ఏమాత్రం డిస్కషన్ జరగవు నాపై అంతగా డిపెండ్ అయి ఉన్నారు.పాపం నా పేరు లేకుండా ఏది చెప్పలేకపోతున్నారు అంటూ ఈమె చేసినటువంటి ఈ ట్వీట్ చూసిన నెటిజెన్స్ మళ్లీ మిమ్మల్ని ఎవరు ఏమి అన్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు.

Mrunal Thakur: సీతారామం 2 సాధ్యమేనా… నేటిజన్ ప్రశ్నకు నటి మృణాల్ సమాధానం ఇదే?

Mrunal Thakur: సీతారామం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు మలయాళీ నటుడు దుల్కర్ సల్మాన్, మరాఠీ నటి మృణాల్ ఠాకూర్. వీరిద్దరూ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన అందమైన ప్రేమ కథ చిత్రం సీతారామం.ఈ సినిమా గత ఏడాది ఆగస్టు నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా ద్వారా వీరిద్దరికి తెలుగులో కూడా విపరీతమైన అభిమానులు పెరిగిపోయారు.

ఇక ఈ సినిమా తర్వాత నటి మృణాల్ నాని హీరోగా నటిస్తున్న తన తదుపరి చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇకపోతే సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటారు. అలాగే వీలు కుదిరినప్పుడు అభిమానులతో కలిసి సరదాగా ముచ్చటిస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే ఓ నేటిజన్ ట్విట్టర్ వేదికగా ఈమెను ప్రశ్నిస్తూ సీతారామం సినిమాకు సీక్వెల్ సినిమా గురించి ప్రశ్నించారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు హీరో చనిపోకుండా పాకిస్తాన్ లో బంధించి ఉన్నారనీఈ పాయింట్ మీద సీక్వెల్ చేస్తారని గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందనే విషయం గురించి నేటిజన్ ప్రశ్నిస్తూ సీతారామం 2 సాధ్యమేనా అని మృణాల్ ను ప్రశ్నించారు.


Mrunal Thakur: ఉంటే బాగుంటుంది…

ఈ ప్రశ్నకు ఈమె ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. తనకు ఈ సినిమా సీక్వెల్ గురించి ఐడియా లేదు కానీ ఉంటే బాగుంటుందని తాను కూడా అనుకుంటున్నట్లు ఈ సందర్భంగా ఈమె సమాధానం చెప్పారు. మరి ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. ఇక ఇందులో రష్మిక కీలక పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే.

Nagababu: నీ అమ్మ మొగుడు ఖర్చు పెట్టాడా… తమ్మారెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నాగబాబు!

Nagababu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ నిర్మాతగా ఉన్నటువంటి తమ్మారెడ్డి భరద్వాజ్ ఈ మధ్య సినిమాలో నిర్మించడం తక్కువ అయినప్పటికీ పలు సినిమాలలో నటుడిగా నటిస్తూ ఉన్నారు. అయితే ఈయన ఇండస్ట్రీ గురించి తరచూ మాట్లాడుతూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు.ఇలా వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలిచే తమ్మారెడ్డి తాజాగా RRR సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సినిమా ఆస్కార్ ప్రమోషన్ల కోసం దాదాపు 80 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారని, ఆ డబ్బుతో మేము ఎనిమిది సినిమాలు చేసే మీ మోహన కొట్టే వాళ్ళం అంటూ కామెంట్లు చేశారు. వీరి అమెరికా ఫ్లైట్ టికెట్లకే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చవుతున్నాయి అంటూ ఈయన RRR సినిమా గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ సంచలనం రేపాయే.

ఇలా తమ్మా రెడ్డి ఈ సినిమా గురించి ఇలా మాట్లాడటం తో నేటిజన్స్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు అయితే తమ్మారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపై పలువురు సెలబ్రిటీలు కూడా స్పందిస్తూ తనకు కౌంటర్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే మెగా బ్రదర్ నాగబాబు కూడా తమ్మారెడ్డి వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేయడమే కాకుండా తమ్మారెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

Nagababu: కొందరికి ఇలాగే సమాధానం చెప్పాలి..


ఈ క్రమంలోనే నాగబాబు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ… నీ అమ్మ మొగుడు ఖర్చు పెట్టాడారా… 80 కోట్లు RRR కోసం.(#RRR మీద కామెంట్ కు వైసిపి వారి భాషలో సమాధానం) అంటూ ఈయన ట్వీట్ చేశారు.ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక నాగబాబు చేసిన ట్వీట్ పై స్పందిస్తూ కొందరికి ఇలాంటి భాషలో సమాధానం చెబితేనే అర్థం అవుతుంది అంటూ ఈయన ట్వీట్ పై సమర్థిస్తూ కామెంట్లు చేస్తున్నారు. మరి నాగబాబు చేసినటువంటి ఈ వ్యాఖ్యలపై తమ్మారెడ్డి స్పందన ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.