Nagababu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ నిర్మాతగా ఉన్నటువంటి తమ్మారెడ్డి భరద్వాజ్ ఈ మధ్య సినిమాలో నిర్మించడం తక్కువ అయినప్పటికీ పలు సినిమాలలో నటుడిగా నటిస్తూ ఉన్నారు. అయితే ఈయన ఇండస్ట్రీ గురించి తరచూ మాట్లాడుతూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు.ఇలా వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలిచే తమ్మారెడ్డి తాజాగా RRR సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సినిమా ఆస్కార్ ప్రమోషన్ల కోసం దాదాపు 80 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారని, ఆ డబ్బుతో మేము ఎనిమిది సినిమాలు చేసే మీ మోహన కొట్టే వాళ్ళం అంటూ కామెంట్లు చేశారు. వీరి అమెరికా ఫ్లైట్ టికెట్లకే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చవుతున్నాయి అంటూ ఈయన RRR సినిమా గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ సంచలనం రేపాయే.
ఇలా తమ్మా రెడ్డి ఈ సినిమా గురించి ఇలా మాట్లాడటం తో నేటిజన్స్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు అయితే తమ్మారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపై పలువురు సెలబ్రిటీలు కూడా స్పందిస్తూ తనకు కౌంటర్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే మెగా బ్రదర్ నాగబాబు కూడా తమ్మారెడ్డి వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేయడమే కాకుండా తమ్మారెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
ఈ క్రమంలోనే నాగబాబు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ… నీ అమ్మ మొగుడు ఖర్చు పెట్టాడారా… 80 కోట్లు RRR కోసం.(#RRR మీద కామెంట్ కు వైసిపి వారి భాషలో సమాధానం) అంటూ ఈయన ట్వీట్ చేశారు.ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక నాగబాబు చేసిన ట్వీట్ పై స్పందిస్తూ కొందరికి ఇలాంటి భాషలో సమాధానం చెబితేనే అర్థం అవుతుంది అంటూ ఈయన ట్వీట్ పై సమర్థిస్తూ కామెంట్లు చేస్తున్నారు. మరి నాగబాబు చేసినటువంటి ఈ వ్యాఖ్యలపై తమ్మారెడ్డి స్పందన ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…