Tag Archives: varun tej

ప్రిన్స్ వరుణ్ తేజ్ జిమ్ కష్టాలు.. ‘గనీ’ మూవీ కోసం చెమటోడుస్తున్న వరున్ తేజ్.. !

సినిమాలో యాక్షన్ థ్రిల్లర్స్ చూడటానికి చాలా బాగా ఉంటాయి. కానీ హీరోలకి మాత్రం పెద్ద సవాలుగా పరిణమిస్తుంటాయి. ఎందుకంటే వాటి కోసం వాళ్లు పడే శ్రమ అంతా ఇంత కాదు.. తమ బాడీలను.. యాటీట్యూడ్.. ఇలా ప్రతిదానిలో మార్పులు చేస్తుంటారు. పాత్రకు తగ్గట్టుగా తమను తాము మార్పుకోవడం.. శరీరాకృతిని మార్చుకోవడం కోసం హీరోలు ఎంతో పట్టుదలతో శ్రమిస్తుంటారు.

ఇప్పుడు అలాంటి ఛాలెంజ్ నే పట్టుదలతో యాక్సెప్ట్ చేశాడు మెగాప్రిన్స్ వరుణ్ తేజ్. గనీ చిత్రంలో బాక్సర్ గా కనిపించబోతోన్న ఆయన జిమ్ లో కండల్ని చెమటలతో మెరిపిస్తున్నాడు. కఠోరమైన వ్యాయామాలు చేస్తూ రాటుదేలుతున్నాడు. స్పోర్ట్స్ డ్రామాగా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం వరుణ్ ఎక్కువగానే కష్టపడుతున్నాడు.

ఇప్పటికే ఈ హీరో.. ఈ సినిమా కోసం తన బాడీ లాంగ్వేజ్ మొత్తాన్ని మార్చేశాడు. అలాగే ఎప్పటికప్పుడూ జిమ్‏లో కఠోరమైన వ్యాయమాలు చేస్తున్నాడు. ఇలా వరుణ్ తేజ్ జిమ్‏లో వర్కవుట్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బ్యాక్ లుక్ లో తీసిన ఈ వీడియోలో వ‌రుణ్ పుల్ అప్స్ తీస్తూ క‌నిపిస్తున్నాడు. హార్డ్ వ‌ర్క్ కు బ్యాక్ అప్ లుండ‌వు అంటూ వీడియోకు క్యాప్షన్స్ ఇచ్చాడు. ఈ వీడియో ఇపుడు నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది.

ఇక ఈమూవీకి సంబంధించిన టీజర్ లేదా ఫస్ట్ గ్లింప్స్ త్వరలోనే విడుదల కానున్నట్లుగా తెలుస్తోంది. ముఖం చూపించకుండా బ్యాక్ సైడ్ తోనే వారెవ్వా అనిపించాడు ఈ ప్రిన్స్ వరుణ్ తేజ్. మంజ్రేకర్ హీరోయిన్ కాగా సునీల్ శెట్టి కీలక పాత్రలో కనిపించనున్నాడు. అల్లు బాబీ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరిదశలో ఉంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

క్లైమాక్స్ కోసం చెమటలు చిందిస్తున్న మెగా హీరో!

సాధారణంగా సినిమాలలో నటించే హీరోలు ఎప్పుడు ఓకే స్టైల్ మెయింటెన్ చేయాలంటే కుదరని పని. ఒక్కో సినిమాకు ఒక్కో విధమైనటువంటి స్టైల్, శరీరాకృతిని మెయింటెన్ చేయాల్సి ఉంటుంది. కథానుసారంగా వారి శరీరాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే హీరోలు కథకు తగ్గట్టుగా శరీరాకృతిని మెయింటైన్ చేయడానికి ఎంతో కష్టపడుతుంటారు.

ముఖ్యంగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాలో నటించే హీరోల శరీరాకృతి కండలు తిరిగి ఉండాల్సిందే. ఇలాంటి పాత్రలలో నటించే హీరోలు అధిక మొత్తంలో చెమట చిందించాల్సి ఉంటుంది.

ప్రస్తుతం ఈవిధంగా చెమటలు చెందించి కండలు తిరిగే శరీరాకృతిని మెయింటైన్ చేయడానికి తెగ కష్టపడుతున్నాడు మెగా హీరో వరుణ్ తేజ్. ప్రస్తుతం వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో “గని” చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించనున్నారు.

బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ కండలు తిరిగిన శరీరం పెంచడంకోసం తెగ కష్టపడుతున్నాడు. ఈ క్రమంలోనే జిమ్ లో కష్టపడుతూ చెమటలు చిందిస్తున్నాడు. ఈ క్రమంలోనే దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ  ‘హార్డ్‌వర్క్‌కు బ్యాక్‌ అప్‌ అంటూ ఉండదు’ అనే క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన సయూ మంజ్రేకర్‌ హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ క్లైమాక్స్ దశకు చేరుకుంది.

మరోసారి రిపీట్ కానున్న ‘ఫిదా’ కాంబో.. ఇక ఆడియన్స్ కి పండగే..!!

మెగా హీరో వరుణ్ తేజ్, సాయి పల్లవి కాంబినేషన్ లో వచ్చిన ‘ఫిదా’ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఆ చిత్రం హిట్ సినిమాకు కొత్తం అర్దం చెప్పినట్లుగా కలెక్షన్స్ వర్షం కురిపించింది..అంతేకాదు సినిమాలో సాయి పల్లవి తన అందం, అభినయం తో ప్రేక్షకుల్ని మంత్ర ముగ్ధుల్ని చేసింది.. అంతే కేవలం ఆ ఒక్క సినిమాతో ఓవర్ నైట్ సెన్సేషన్ గా మారి ఫుల్ బిజీ అయ్యిపోయింది.

దాంతో ఇప్పుడు అదే కాంబినేషన్ ని రిపీట్ చేస్తున్నారు. ఇంతకీ ఎవరా డైరక్టర్, ఏమా కథ అంటారా..కరోనా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు వరుణ్ తేజ్. ప్రస్తుతం కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో ‘గని’ అనే స్పోర్ట్స్‌ డ్రామా చేస్తున్నారు వరుణ్‌ తేజ్‌.అలాగే అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్‌తో కలసి ‘ఎఫ్‌ 3’ చిత్రంలోనూ నటిస్తున్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా ఈ రెండు సినిమాల చిత్రీకరణకు బ్రేక్‌ పడింది.

ఈ గ్యాప్‌లోనే ‘ఛలో, భీష్మ’ చిత్రాల ఫేమ్‌ వెంకీ కుడుముల చెప్పిన స్టోరీ లైన్‌ విన్నారట వరుణ్‌. వెంకీ చెప్పిన స్టోరీ లైన్‌ నచ్చడంతో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు వరుణ్‌ తేజ్‌.ప్రస్తుతం నటిస్తున్న ‘గని, ఎఫ్‌ 3’ చిత్రాల షూటింగ్‌ పూర్తయిన వెంటనే వెంకీ కుడుముల ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నారని సమాచారం. అన్నీ కుదిరితే దసరాకి చిత్రీకరణ మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌ నిర్మించనుందని తెలిసింది.

ఈ సినిమాలో వరణ్ సందేశ్ సరసన సాయి పల్లవిని ఎంపిక చేసారు. ప్రస్తుతం ఈ మేరకు టాక్స్ జరుగుతున్నాయి. అయితే కరోనా సమస్యతో డేట్స్ అందరివీ డిస్ట్రబ్ అయ్యిపోయాయి. దాంతో సాయి పల్లవి తను ఖచ్చితంగా ఫలానా తేదీ నుంచి డేట్స్ ఇవ్వగలను అని చెప్పలేనని అందిట. ఇక మరోవైపు దర్శకుడు వెంకీ ఇప్పటికే వరుణ్ కి ఒక నెరేషన్ ఇచ్చాడు. త్వరలోనే ఫైనల్ స్క్రిప్ట్ చెప్పాల్సి ఉంది. ప్రస్తుతం కథకు తుది మెరుగులు దిద్దే పనిలో బిజీగా ఉన్నాడు వెంకీ కుడుముల..!!