Tag Archives: Veera Simhareddy

Balakrishna: అందుకే అలాంటి డైలాగులు పెట్టాము… వీర సింహారెడ్డి పొలిటికల్ డైలాగులపై బాలయ్య కామెంట్స్..!

Balakrishna: సాధారణంగా బాలయ్య సినిమా అంటేనే ప్రేక్షకులు పంచ్ డైలాగులు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే సినిమాలలో బాలకృష్ణ చెప్పే పంచ్ డైలాగులు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుని ఎప్పటికీ ట్రెండింగ్ లో ఉంటాయి. ఇక ఇటీవల వీర సింహారెడ్డి సినిమాలో కూడా బాలయ్య చెప్పిన డైలాగులు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన వీర సింహారెడ్డి సినిమాలో బాలకృష్ణ హీరోగా నటించిన సంగతి అందరికీ తెలిసిందే.

ఇటీవల జనవరి 12వ తేదీన ఈ సినిమా విడుదల అయ్యి మంచి హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఇక బాలయ్య బాబు అభిమానులు థియేటర్స్ లో చేసే సందడి అంతా ఇంతా కాదు. ఈ సినిమాలో ఆకట్టుకునే కథనంతో పాటు పాటలు, పంచ్ డైలాగులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో బాలయ్య బాబు చెప్పిన డైలాగులు పొలిటికల్ ఆంధ్రప్రదేశ్ అధికారపక్ష నాయకులను ఉద్దేశిస్తూ ఉన్నాయని ప్రజలు చర్చించుకుంటున్నారు.

ఇలా సినిమాల ద్వారా బాలకృష్ణ అధికారపక్షం గురించి పరోక్షంగా సెటైర్ లు వేసినట్టు ప్రేక్షకులు భావిస్తున్నారు. అంతేకాకుండా బాలయ్య చెప్పిన ఈ పొలిటికల్ డైలాగులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారాయి. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బాలకృష్ణ ఈ పొలిటికల్ డైలాగుల గురించి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంటర్వ్యూలో పాల్గొన్న బాలకృష్ణ మాట్లాడుతూ.. “సినిమాలకు మనుషులకు చాలా దగ్గర బంధం ఉంటుందని వెల్లడించాడు. ప్రజల నిజజీవితంలో జరిగే విషయాలను సినిమాలలో చూపిస్తామని” బాలయ్య చెప్పుకొచ్చాడు.

Balakrishna: రాజకీయ చర్చలకు కారణమైన వీర సింహారెడ్డి డైలాగ్స్…

ఈ సినిమాలో మాత్రం నిజంగానే జరిగిన విషయాల గురించి బాలయ్య ఇలా డైలాగులు చెప్పారని వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసిన రోజు నుండి ఈ పొలిటికల్ డైలాగుల గురించి చర్చ జరుగుతుంది. ఇక ఈ డైలాగుల గురించి ఆంధ్రప్రదేశ్ అధికారపక్ష నాయకులకు కూడా స్పందిస్తున్నారు.

Ap Government: వాల్తేరు వీరయ్య…. వీర సింహారెడ్డికి షాక్ ఇచ్చిన జగన్ సర్కార్….. ప్రీ రిలీజ్ వేడుకలకు నో పర్మిషన్!

Ap Government: సంక్రాంతి పండుగ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణ ఇద్దరు కూడా సంక్రాంతి బరిలో పోటీకి సై అంటున్నారు.వీరిద్దరూ కూడా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వాల్తేరు వీరసింహారెడ్డి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇకపోతే ఈ రెండు సినిమాలను ఒకే నిర్మాణ సంస్థ నిర్మించడంతో థియేటర్ల సమస్య కారణంగా మైత్రి మూవీ మేకర్స్ వారు చాలా ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తుంది.

ఈ క్రమంలోనే మైత్రి నిర్మాతలు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసి తమ సినిమాల పరిస్థితి వివరించి అదనపు షోలు టికెట్ల రేట్లు పెంపుదలపై మాట్లాడినట్టు సమాచారం. అయితే ఏపీ ప్రభుత్వం కూడా ఇందుకు సానుకూలంగానే ఉన్నారని త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్నారని ఆశగా ఎదురు చూశారు.ఇలా ఏపీ ప్రభుత్వం నుంచి శుభవార్త కోసం ఎదురుచూస్తున్న మైత్రి మేకర్స్ కు జగన్ ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది.

వాల్తేరు వీరయ్య సినిమా ప్రీ రిలీజ్ వేడుకను విశాఖపట్నంలో నిర్వహించాలని భావించారు. అలాగే వీరసింహారెడ్డి సినిమా ఈవెంట్ ను ఒంగోలులో నిర్వహించాలని ప్లాన్ చేశారు. ప్రభుత్వం అనుమతి లేకుండా మేకర్ సినిమా ఈవెంట్లను ప్లాన్ చేయడంతో ఈ ప్రీ రిలీజ్ వేడుకలను నిర్వహించడానికి ఏపీ సర్కార్ అనుమతి ఇవ్వలేదు.ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి పర్మిషన్ లేకుండా సినిమా వేడుకలను ఏర్పాటు చేస్తే బందోబస్తు నిర్వహించడానికి చాలా కష్టతరంగా మారుతుంది.

Ap Government: మైత్రి వారికి షాక్ ఇచ్చిన ఏపీ సర్కార్…

ఈ విధంగా బహిరంగంగా రోడ్లపై ఇలాంటి వేడుకలను నిర్వహించడం వల్ల భారీ సంఖ్యలో అభిమానులు రావడంతో వారిని కంట్రోల్ చేయలేక ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి బహిరంగ వేడుకలకు ఏపీ సర్కార్ అనుమతి తెలుపకపోవడంతో చేసేదేమీ లేక సినిమా ఈవెంట్లను మరొక ప్రాంతంలో నిర్వహించడానికి మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే త్వరలోనే ఈ విషయం గురించి అధికారకంగా వెల్లడించనున్నారు.