Ap Government: సంక్రాంతి పండుగ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణ ఇద్దరు కూడా సంక్రాంతి బరిలో పోటీకి సై అంటున్నారు.వీరిద్దరూ కూడా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వాల్తేరు వీరసింహారెడ్డి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇకపోతే ఈ రెండు సినిమాలను ఒకే నిర్మాణ సంస్థ నిర్మించడంతో థియేటర్ల సమస్య కారణంగా మైత్రి మూవీ మేకర్స్ వారు చాలా ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తుంది.
ఈ క్రమంలోనే మైత్రి నిర్మాతలు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసి తమ సినిమాల పరిస్థితి వివరించి అదనపు షోలు టికెట్ల రేట్లు పెంపుదలపై మాట్లాడినట్టు సమాచారం. అయితే ఏపీ ప్రభుత్వం కూడా ఇందుకు సానుకూలంగానే ఉన్నారని త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్నారని ఆశగా ఎదురు చూశారు.ఇలా ఏపీ ప్రభుత్వం నుంచి శుభవార్త కోసం ఎదురుచూస్తున్న మైత్రి మేకర్స్ కు జగన్ ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది.
వాల్తేరు వీరయ్య సినిమా ప్రీ రిలీజ్ వేడుకను విశాఖపట్నంలో నిర్వహించాలని భావించారు. అలాగే వీరసింహారెడ్డి సినిమా ఈవెంట్ ను ఒంగోలులో నిర్వహించాలని ప్లాన్ చేశారు. ప్రభుత్వం అనుమతి లేకుండా మేకర్ సినిమా ఈవెంట్లను ప్లాన్ చేయడంతో ఈ ప్రీ రిలీజ్ వేడుకలను నిర్వహించడానికి ఏపీ సర్కార్ అనుమతి ఇవ్వలేదు.ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి పర్మిషన్ లేకుండా సినిమా వేడుకలను ఏర్పాటు చేస్తే బందోబస్తు నిర్వహించడానికి చాలా కష్టతరంగా మారుతుంది.
ఈ విధంగా బహిరంగంగా రోడ్లపై ఇలాంటి వేడుకలను నిర్వహించడం వల్ల భారీ సంఖ్యలో అభిమానులు రావడంతో వారిని కంట్రోల్ చేయలేక ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి బహిరంగ వేడుకలకు ఏపీ సర్కార్ అనుమతి తెలుపకపోవడంతో చేసేదేమీ లేక సినిమా ఈవెంట్లను మరొక ప్రాంతంలో నిర్వహించడానికి మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే త్వరలోనే ఈ విషయం గురించి అధికారకంగా వెల్లడించనున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…