Tag Archives: vijaya nirmala

Naresh: ఈ వయసులో పిల్లలను కనడం గురించి బోల్డ్ కామెంట్స్ చేసిన నరేష్… ఏమన్నారంటే?

Naresh: నరేష్ పవిత్ర లోకేష్ ఇద్దరు టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా పాపులర్ అయిన సెలబ్రిటీలలో ఒకరు చెప్పాలి. వీరిద్దరూ ఇదివరకే పెళ్లిళ్లు చేసుకొని పిల్లలు ఉన్నప్పటికీ వారి నుంచి దూరంగా ఉంటూ ప్రస్తుతం రిలేషన్ లో ఉన్న విషయం మనకు తెలిసిందే.ఇలా వీరిద్దరూ రిలేషన్ లో ఉండటమే కాకుండా త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇక ఇద్దరూ జంటగా మళ్లీ పెళ్లి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా పవిత్ర నరేష్ ఇద్దరు కూడా జంటగా పాల్గొన్న విషయం మనకు తెలిసిందే. ఇలా వీరిద్దరూ పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ పెద్ద ఎత్తున డాన్సులు చేయడం, ముద్దులు పెట్టుకుంటూ పెద్ద ఎత్తున రచ్చ చేశారు.

ఇకపోతే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నపవిత్ర లోకేష్ నరేష్ ఇద్దరు కూడా ఈ వయసులో పిల్లలను కనడం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ తామిద్దరం శారీరకంగా చాలా ఫిట్ గా ఉన్నామని బోల్డ్ కామెంట్స్ చేశారు.ప్రస్తుతం తనకు పవిత్రకు ఉన్న పిల్లలు ఇద్దరికీ సమానమేనని తెలియజేశారు అయితే భవిష్యత్తు ఏంటి అనేది మాత్రం చెప్పలేనని తెలిపారు.

Naresh: అమ్మలాంటి అమ్మాయే పవిత్ర…

మా అమ్మ నా విషయంలో ఎప్పుడు బాధపడుతూ ఉండేది తన లాంటి అమ్మాయిని నాకు భార్యగా ఇవ్వలేకపోయానని బాధపడుతూ ఉండేది.అయితే అమ్మలాంటి అమ్మాయి ఈ పవిత్ర అమ్మ పుట్టినరోజు తన పుట్టినరోజు అలాగే అమ్మ కళ్ళు మాదిరిగానే పవిత్ర కళ్ళు కూడా ఉంటాయని ఈ ఇద్దరికీ కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి అంటూ ఈ సందర్భంగా నరేష్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Actor Naresh: నటుడు నరేశ్ కి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా…. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Actor Naresh: ప్రముఖ నటి విజయనిర్మల వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నరేష్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పాటు చేసుకున్నాడు. హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన నరేష్ ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే ఏడాదికాలంగా నరేష్ తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. నరేష్ మూడు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

మొదటి ఇద్దరి భార్యలకు చట్టపరంగా విడాకులు ఇచ్చిన నరేష్ మూడో భార్య రమ్య రఘుపతికి చట్టపరంగా విడాకులు ఇవ్వకుండానే క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు పొందిన పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తున్నాడు.
ఈ విషయాన్ని నరేష్, పవిత్ర లోకేష్ అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలో వీరిద్దరి రిలేషన్ గురించి నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి సంచలన వ్యాఖ్యలు చేసింది. చాలా కాలంగా వీరి ముగ్గురి మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది.

ఇదిలా ఉండగా ఇప్పటికే ఎన్నో సినిమాలలో కలిసి నటించిన నరేష్, పవిత్ర లోకేష్ తాజాగా ‘ మళ్లీ పెళ్లి ‘ సినిమాలో జంటగా నటించారు. నరేష్ జీవితంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందించినట్లు తెలుస్తోంది. అయితే నరేష్ మాత్రం ఇది తన బయోపిక్ కాదని ఖండిస్తున్నాడు. ఇదిలా ఉండగా ఈ సినిమాకి నరేష్ నిర్మాతగా వ్యవహరించాడు.

Actor Naresh: వేల కోట్ల ఆస్తులు….

ఈ క్రమంలో నరేష్ ఆస్తుల వివరాల గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. నరేష్ కి తల్లి విజయనిర్మల ఇచ్చిన ఆస్తులు మాత్రమే కాకుండా తాను సినిమాలలో నటించి సంపాదించిన ఆస్తులు కూడా పెద్ద మొత్తంలో ఉన్నట్లు తెలుస్తోంది. నరేష్ కి వందల కోట్ల రూపాయలు విలువ చేసి ఆస్తులు ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల నుండి సమాచారం. అయితే నరేష్ పవిత్ర లోకేష్ జంటగా నటించిన మళ్లీ పెళ్లి సినిమాలో నరేష్ జీవితంలో జరిగిన యదార్థ సంఘటనలు కళ్లకు కట్టినట్టు చూపించారు. ఈ క్రమంలో ఈ సినిమా లో ఒక సన్నివేశంలో ‘ మీకెంటి సర్ 1000 కోట్ల ఫిగర్ ‘ అనే డైలాగ్ బట్టి చూస్తే నరేష్ కి వేలకోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో నరేష్ ఆస్తులు వివరాల తెలిసి అందరూ షాక్ అవుతున్నారు.

Pavitra Lokesh: కృష్ణ విజయ నిర్మల ఆశీస్సులు మాపై ఎప్పుడూ ఉంటాయి… విజయనిర్మల షాకింగ్ కామెంట్స్!

Pavitra Lokesh: టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో పేరు సంపాదించుకున్న నటి పవిత్ర లోకేష్ నటుడు నరేష్ రిలేషన్లో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇలా రిలేషన్ లో ఉన్నటువంటి ఈ జంట త్వరలో పెళ్లికూడా చేసుకోబోతున్నారని పెద్ద ఎత్తున వచ్చాయి. ఇక వీరిద్దరూ సహజీవనం చేస్తున్న విషయం కూడా తెలిసిందే. తాజాగా నరేష్ పవిత్ర లోకేష్ మళ్లీ పెళ్లి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా నటి పవిత్ర లోకేష్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా పవిత్ర లోకేష్ మాట్లాడుతూ విజయ్ కృష్ణ మూవీస్ బ్యానర్ తిరిగి మళ్లీ పెళ్లి సినిమా ద్వారా ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

ఈ బ్యానర్ ద్వారా ఎన్నో అద్భుతమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక ఈ బ్యానర్ తిరిగి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నందుకు ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడు ఎంతో గర్వించదగిన విషయమని తెలిపారు. మాపై విజయనిర్మల కృష్ణ గారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని ఈ సందర్భంగా పవిత్ర లోకేష్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Pavitra Lokesh: నరేష్ నిర్మాతగా మళ్లీ పెళ్లి…


మళ్లీ పెళ్లి అనే సినిమాని విజయ కృష్ణ మూవీస్ బ్యానర్ పై నరేష్ నిర్మించిన విషయం మనకు తెలిసిందే ఇందులో నరేష్ జీవిత కథ ఆధారంగా ఆయన జీవితంలో చేసుకున్నటువంటి పెళ్లిళ్ల గురించి చూపించబోతున్నారని తెలుస్తోంది. అదేవిధంగా ఈ సినిమాలో కృష్ణ కుటుంబ విషయాలను కూడా ప్రేక్షకులకు తెలియజేయబోతున్నారని తెలుస్తోంది. ఇలా ట్రైలర్ లాంచ్ లో పవిత్ర లోకేష్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

హాఫ్ సెంచరీ కొట్టిన ‘మోసగాళ్లకు మోసగాడు’.. అప్పట్లో భారీ బడ్జెట్.. సూపర్ హిట్ టాక్ అయినా నష్టాలే..

పద్మాలయా ఫిలింస్ బ్యానర్‌లో సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల హీరో, హీరోయిన్లుగా ప్రముఖ నిర్మాత ఘట్టమనేని ఆది శేషగిరిరావు ప్రతిష్టాత్మకం గా నిర్మించిన ‘మోసగాళ్లకు మోసగాడు’. ఈ చిత్రం విడుదలై నేటికి అంటే ఆగస్టు 27 నాటికి 50 సంవత్సరాలు. ఇది ఆగస్టు 27, 1971 సంవత్సరంలో విడుదలైంది. ఈ సినిమా అప్పట్లో పెద్ద బంపర్ హిట్ కొట్టేసింది.

అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కూడా తెచ్చుకుంది. భారతదేశంలో తొలి కౌబాయ్ చిత్రం కావడం కూడా విశేషం. ఇది దాదాపు ప్రపంచవ్యాప్తంగా 125 దేశాలలో ప్రదర్శింపబడి ప్రకంపనలు సృష్టించింది. పాన్ ఇండియా సినిమాలు అని చెప్పుకుంటున్న ఈ రోజుల్లో ఏ మాత్రం గ్రాఫిక్స్ లేకుండా సినిమాను తీయలేకపోతున్నారు. కానీ ఆ రోజుల్లోని ఇలాంటి పాన్ ఇండియా సినిమాతీసి సంచలనం స్పష్టించారు. ఆ సినిమాతో సూపర్ స్టార్ కృష్ణను అభిమానులు ఆంధ్రా జేమ్స్‌బాండ్ అని పిలవడం మొదలు పెట్టారు.

మరో విశేషం ఏంటంటే.. పద్మాలయా సంస్థ కూడా రూపొందించబడి 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. హిందీ, తమిళం, ఇంగ్లీష్‌తో పాటు రష్యన్, స్పానిష్‌తో పలు భాషల్లో డబ్ చేయబడింది ఈ చిత్రం. ఈ సినిమా విడుదలైన తర్వాత కొన్నాళ్లకు కొన్ని థియేటర్లలో మళ్లీ విడుదల చేశారు. అప్పుడు కూడా విజయవంతంగా రన్ చేయబడిన చిత్రం మోసగాళ్లకు మోసగాడు. ఈ సినిమాను అప్పట్లో రూ. 6 లక్షల 70 వేలతో రూపొందించారు. అయితే ఆ సమయంలో నాన్ థియేట్రికల్ రైట్స్ పెద్దగా వచ్చేవి ఏమీలేకపోవడం ఒక పెద్ద మైనస్ అయింది. ఇక సినిమా రూ.4.5 లక్షలకు విక్రయించారు. దీనితో అప్పట్లోనే సూపర్ స్టార్ కృష్ణ సొంత బ్యానర్ కావడంతో రూ.2.5 లక్షల వరకు నష్టాలు వచ్చినట్టు తెలుస్తుంది.

ఈ చిత్రానికి ఆది నారాయణ రావు సంగీతం అందించగా.. వి.యస్.ఆర్.స్వామి సినిమాటోగ్రఫీ అందించారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. 1972 సంవత్సరంలో రష్యాలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఈ చిత్రం ప్రదర్శింపబడింది.