Tag Archives: world cup

T20 World Cup: వరల్డ్ కప్ గెలిచేది టీమిండియానే.. జోస్యం చెప్పిన ఏబీ డివిలియర్స్‌!

T20 World Cup: టి20 వరల్డ్ కప్ చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలోనే సెమీఫైనల్స్ అనంతరం ఫైనల్ జరుగునున్న నేపథ్యంలో ఫైనల్ లో ఏ ఏ జట్టు తల పడబోతున్నారు చివరికి వరల్డ్ కప్ ఎవరు గెలుస్తారో అనే విషయంపై తీవ్ర ఉత్కంఠత నెలకొంది ఇకపోతే ఇప్పటికే సెమీఫైనల్స్ లో చోటు సంపాదించుకున్న ఇండియా ఫైనల్ లో కూడా తలబడబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఫైనల్ లో టీమిండియా ఎవరితో పోటీ పడిపోతుంది ఎవరు కప్పు గెలుచుకుంటారనే విషయంపై సౌత్ ఆఫ్రికాకు చెందిన ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ జోస్యం చెప్పారు. ప్రస్తుతం ఇండియాలో పర్యటిస్తున్నటువంటి ఈయన సచిన్ టెండూల్కర్ తో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొనడమే కాకుండా పలు ప్రాంతాలలో పర్యటిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఏబీ డివిలియర్స్‌ వరల్డ్ కప్ గురించి మాట్లాడుతూ ఫైనల్ లో టీమిండియాతో న్యూజిలాండ్ పోటీ పడిపోతుందని ఈయన తెలిపారు. ఇక ఫైనల్ లో టీమిండియా విజయం సాధిస్తుందని ఈయన చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక ఇప్పటికే సెమీఫైనల్ లో చోటు సంపాదించుకున్న జట్ల గురించి ప్రకటించిన విషయం తెలిసిందే మొదటి సెమీఫైనల్ లో పాకిస్తాన్ న్యూజిలాండ్ పోటీ పడగా రెండవ సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ టీమిండియా పోటీ పడిపోతుంది.

T20 World Cup: కప్ టీమిండియాదే…

ఏబీ డివిలియర్స్‌ ప్రకారం మొదటి సెమీఫైనల్స్ లో పాక్ పై న్యూజిలాండ్ విజయం సాధించగా రెండవ సెమీ ఫైనల్ లో ఇంగ్లాండ్ పై టీమిండియా విజయం సాధిస్తుందని, ఫైనల్లో ఈ రెండు జట్లు పోటీ పడగా చివరికి ఇండియా కప్ గెలుచుకుంటుందని తెలియజేశారు. ఈ విధంగా వరల్డ్ కప్ మ్యాచ్ ను ఉద్దేశిస్తూ ఏబీ డివిలియర్స్‌ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈయన చెప్పినట్టుగానే ఫైనల్ లో టీమిండియా గెలిచి కప్పు సాధించాలనీ ప్రతి ఒక్క భారతీయుడు కోరుకుంటున్నారు.

Kapil Dev: మొదటి వరల్డ్ కప్ క్షణాలు మన కళ్ల ముందుకు..కపిల్ దేవ్ భావోద్వేగపూరిత వ్యాఖ్యలు..!

Kapil Dev: ఇండియాలో క్రికెట్ క్రేజ్ గురించి ప్రత్యేకం చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా 1983లో జరిగిన వరల్డ్ కప్ లో ఇండియా ఘన విజయం సాధించిన తర్వాత  ఈ క్రేజ్ మరింతగా పెరింగింది. ప్రస్తుతం 1983 లో వరల్డ్ కప్ బ్యాక్ డ్రాప్ లో  వస్తున్న మూవీ ’83‘ విడుదలకు సిద్ధమైంది. కపిల్‌ దేవ్‌గా రణ్‌వీర్‌ సింగ్, కపిల్‌ సతీమణి రూమీ భాటియాగా దీపికా పదుకోన్‌ నటించారు.

Kapil Dev: మొదటి వరల్డ్ కప్ క్షణాలు మన కళ్ల ముందుకు..కపిల్ దేవ్ భావోద్వేగపూరిత వ్యాఖ్యలు..!

1983జూన్ 25న జరిగిన వరల్డ్ కప్ పోటీలో ఇండియా విశ్వ విజేతగా నిలిచిపోవడం మరవలేని క్షణాలని క్రికెట్ లెజెండ్ కపిల్ దేశ్ అన్నారు. 38 ఏళ్ల తర్వాత ‘83’ ద్వారా మరోసారి ఆ క్షణాలను వెండితెరపై ప్రేక్షకులతో కలిసి చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. కబీర్ ఖాన్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌ సమర్పణలో 83 మూవీ నేడు విడుదల అవుతోంది.

Kapil Dev: మొదటి వరల్డ్ కప్ క్షణాలు మన కళ్ల ముందుకు..కపిల్ దేవ్ భావోద్వేగపూరిత వ్యాఖ్యలు..!

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ హైదరాబాద్లో జరిగింది. ప్రెస్ మీట్ లో హీరో నాగార్జున మాట్లాడుతూ.. 83లో నిజంగా కపిల్ దేవే నటించాడా.. అన్న రీతితో రణ్ వీర్ సింగ్ ఒదిగిపోయాడని పొగడ్తలు కురిపించారు. 83 హీరో రణ్ వీర్ సింగ్ మాట్లాడుతప.. కపిల్ దేవ్ లాంటి లెజెండ్ పాత్ర చేయడం గర్వంగా ఉందన్నారు. మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో నా పాత్రను జీవా అద్భుతంగా చేశారని అన్నారు

రణ వీర్ సింగ్,దీపికా 83:

మరో ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పకొచ్చారు శ్రీకాంత్.. నాగార్జున నేను ఇంజనీరింగ్ లో క్లాస్ మెట్స్ .. కాలేజీలో సైలెంట్ గా ఉన్న నాగ్.. శివతో వైలెంట్ ట్రెండ్ సెట్ చేశారన్నారు. చిత్ర దర్శకుడు కబీర్ ఖాన్ మాట్లాడుతూ.. ఈసినిమా కోసం కపిల్ తో పాటు అప్పటి టీం ను కలిసి సలహాలు తీసుకున్నామన్నారు. 1983లో వరల్డ్ కప్ గెలుచుకున్న తర్వాత క్షణాలను, పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించామన్నారు. ముఖ్యంగా నేటి యువతరం చూడాల్సిన సినిమా అన్నారు

క్రికెట్ అభిమానులు పండగ చేసుకునే వార్త.. ఏంటంటే..

గత కొన్ని రోజుల నుంచి క్రికెట్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఐపీఎల్ మొదలైన దగ్గర నుంచి అభిమానులు సందడి చేస్తున్నారు. ఐపీఎల్ అయిపోగానే వెంటనే టీ20 వరల్డ్ కప్ వచ్చింది. తర్వాత వెంటనే మళ్లీ న్యూజిలాండ్ తో టీ20 మరియు టెస్టు ఆడనున్నారు. 2022 ఆస్ట్రేలియా వేదికగా మరో టీ20 వరల్డ్ కప్ సమరం ఉండనుంది.

మళ్లీ మరుసటి సంవత్సరం 2023 లో వన్డే వరల్డ్ కప్ మన భారతదేశం వేదిక కానుంది. అయితే తాజాగా 2024లో నిర్వహించే క్రికెట్ కు సంబంధించి 8 ఐసీసీ టోర్నమెంట్ల వేదికలను ఐసీసీ తాజాగా ప్రకటించింది. 14 దేశాల్లో ఈ టోర్నమెంట్లు జరుగనున్నట్లు ట్విట్టర్ వేదిక ద్వారా ప్రకటించారు. 2024 టీ 20 వరల్డ్‌ కప్‌ యూఎస్‌ఏ, వెస్టిండీస్‌ లో జరుగనుంది.

2025 చాంపియన్‌ ట్రోపికి పాకిస్తాన్‌ వేదిక కానుంది. ఇక 2026 టీ20 వరల్డ్‌ కప్‌ ఇండియా, శ్రీలంక లో జరుగనుంది. ఇక 2027 వరల్డ్‌ కప్‌ కు సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలు కానున్నట్లు ట్విట్టర్ లో ప్రకటించారు. అలాగే… 2028 టీ20 వరల్డ్‌ కప్‌ ఆసీస్‌, న్యూజిలాండ్‌ దేశాలు వేదికలు కానున్నాయి. 2029 లో చాంపియన్‌ ట్రోఫికి ఇండియా వేదిక కానుంది.

2030 టీ 20 వరల్డ్‌ కప్‌కు ఇంగ్లండ్‌, ఐర్లాండ్‌, స్కాట్లాండ్‌ లు వేదికలు కానున్నాయి. 2031 వరల్డ్‌ కప్‌ కు ఇండియా, బంగ్లా దేశ్ దేశాలు వేదికలు కానున్నాయి. ఈ కొత్త వేదికలు.. టైం టేబుల్ లతో క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆ షెడ్యూల్ ప్రకారమే వారి వారి వ్యక్తిగత పనులను చేసుకునేందుకు అవకాశం ఉండనుంది.