T20 World Cup: టి20 వరల్డ్ కప్ చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలోనే సెమీఫైనల్స్ అనంతరం ఫైనల్ జరుగునున్న నేపథ్యంలో ఫైనల్ లో ఏ ఏ జట్టు తల పడబోతున్నారు చివరికి వరల్డ్ కప్ ఎవరు గెలుస్తారో అనే విషయంపై తీవ్ర ఉత్కంఠత నెలకొంది ఇకపోతే ఇప్పటికే సెమీఫైనల్స్ లో చోటు సంపాదించుకున్న ఇండియా ఫైనల్ లో కూడా తలబడబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఫైనల్ లో టీమిండియా ఎవరితో పోటీ పడిపోతుంది ఎవరు కప్పు గెలుచుకుంటారనే విషయంపై సౌత్ ఆఫ్రికాకు చెందిన ఆటగాడు ఏబీ డివిలియర్స్ జోస్యం చెప్పారు. ప్రస్తుతం ఇండియాలో పర్యటిస్తున్నటువంటి ఈయన సచిన్ టెండూల్కర్ తో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొనడమే కాకుండా పలు ప్రాంతాలలో పర్యటిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఏబీ డివిలియర్స్ వరల్డ్ కప్ గురించి మాట్లాడుతూ ఫైనల్ లో టీమిండియాతో న్యూజిలాండ్ పోటీ పడిపోతుందని ఈయన తెలిపారు. ఇక ఫైనల్ లో టీమిండియా విజయం సాధిస్తుందని ఈయన చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక ఇప్పటికే సెమీఫైనల్ లో చోటు సంపాదించుకున్న జట్ల గురించి ప్రకటించిన విషయం తెలిసిందే మొదటి సెమీఫైనల్ లో పాకిస్తాన్ న్యూజిలాండ్ పోటీ పడగా రెండవ సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ టీమిండియా పోటీ పడిపోతుంది.
ఏబీ డివిలియర్స్ ప్రకారం మొదటి సెమీఫైనల్స్ లో పాక్ పై న్యూజిలాండ్ విజయం సాధించగా రెండవ సెమీ ఫైనల్ లో ఇంగ్లాండ్ పై టీమిండియా విజయం సాధిస్తుందని, ఫైనల్లో ఈ రెండు జట్లు పోటీ పడగా చివరికి ఇండియా కప్ గెలుచుకుంటుందని తెలియజేశారు. ఈ విధంగా వరల్డ్ కప్ మ్యాచ్ ను ఉద్దేశిస్తూ ఏబీ డివిలియర్స్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈయన చెప్పినట్టుగానే ఫైనల్ లో టీమిండియా గెలిచి కప్పు సాధించాలనీ ప్రతి ఒక్క భారతీయుడు కోరుకుంటున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…