Tag Archives: Ys viveka

వైయస్ వివేకా హత్య కేసులో కొనసాగుతున్న విచారణ!

ఏపీ మాజీ మంత్రి వైయస్ వివేకా హత్యలో సీబీఐ విచారణ 69వ రోజు కొనసాగింది. అధికారులు రెండు బృందాలుగా పులివెందులలో విచారణ చేపట్టారు. తుమ్మలపల్లి కర్మాగారంలో పనిచేసే ఉద్యోగి ఉదయ్ కుమార్ రెడ్డితో పాటు ఆయన తండ్రి ప్రకాష్ రెడ్డిని అధికారులు ప్రశ్నించారు .

కాగా విచారణలో భాగంగా అధికారులు ఇద్దరు అనుమానితులను విచారించారు. సీబీఐ కస్టడీలో ఉన్న సునీల్​యాదవ్​తో పాటు అతని సమీప బంధువు భరత్​కుమార్​ యాదవ్​ను ప్రశ్నించారు. వివేకా కుమార్తె సునీత.. తనకు భద్రత కల్పించాలని ఎస్పీకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పులివెందుల పోలీసులు వివేకా ఇంటి వద్ద పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. అంతేకాక ఈనెల 10న పులివెందుల వివేకా ఇంటి వద్ద అనుమానాస్పదంగా తిరిగినా మణికంఠరెడ్డిని ఇవాళ పోలిసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పలు విషయాలపై మణికంఠ రెడ్డిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అనంతరం… మణికంఠ రెడ్డిపై బైండోవర్ కేసు నమోదైంది. .

వైయస్ వివేకా కేసులో మరో ట్విస్ట్!

మాజీ మంత్రి వైయస్ వివేకా కూతురు సునీత కడప ఎస్పీ కి లేఖ రాశారు. పులివెందులలో తమ ఇంటి వద్ద మణికంఠ రెడ్డి అనే వ్యక్తి రెక్కీ నిర్వహించాడని లేఖలో పేర్కొంది. తమ కుటుంబానికి ప్రాణహాని ముప్పు పొంచి ఉందని సునీత పేర్కొన్నారు.

మరో వైపు సీబీఐ అధికారులు వివేకా హత్య కేసులో అనుమానితులను విచారిస్తున్న సమయంలో సునీత లేఖ రాయడం పలు అనుమానితులను దారితీస్తోంది. రెక్కి నిర్వహించిన మణికంఠ రెడ్డి అనే వ్యక్తి.. వైకాపా నాయకుడు దేవిరెడ్డి శంకర్రెడ్డి అనుచరుడని సునీత తెలిపారు.

వైయస్ వివేకా హత్య కేసు దర్యాప్తు ముమ్మరం!

వైఎస్ వివేకా హత్య కేసు విచారణ కొనసాగుతోంది. కడప పులివెందుల లో అనుమానితులను సిబిఐ అధికారులు విచారస్తున్నారు. పులివెందుల ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్లో వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఉమా శంకర్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ లను అధికారులు విచారించారు.

కాగా ఇప్పటికే ఎంపీ అవినాష్ రెడ్డి తో పాటు మరికొందరని విచారించిన అధికారులు.. పులివెందుల క్యాంపు కార్యాలయంలో పనిచేసే రఘునాథ్ రెడ్డి ని సైతం ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కస్టడీలో ఉన్న డ్రైవర్ సునీల్ కలవడానికి తన కుటుంబ సభ్యులకు అధికారులు అనుమతి ఇచ్చారు