Syamala Devi : ప్రభాస్ పై వేణు స్వామి చేసిన వాఖ్యలు మమ్మల్ని బాధపెట్టాయి: శ్యామల దేవి

Syamala Devi : రెబల్ స్టార్ కృష్ణంరాజు భార్య పాన్ ఇండియా హీరో ప్రభాస్ పెద్దమ్మ అయిన శ్యామలాదేవి గురించి మనందరికీ తెలిసిందే. కృష్ణంరాజు ఉన్నంతవరకు సోషల్ మీడియాకు, మీడియాకు కాస్త దూరంగా ఉంటూ వచ్చిన శ్యామల దేవి భర్త మరణం తర్వాత కొన్ని ఇంటర్వ్యూలకు హాజరవుతూ వచ్చారు. ఇక తాజాగా తన భర్త జయంతి సందర్భంగా శ్యామలాదేవి ఒక మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ప్రభాస్ గురించి జ్యోతిష్యులు వేణు స్వామి చేసిన కామెంట్స్‌పై ఆమె ఎమోషనల్ అయ్యారు.

ఈ సందర్భంగా మీడియాతో శ్యామలాదేవి మాట్లాడుతూ.. కృష్ణంరాజు లేరన్న విషయాన్ని నేను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను. ఆ విషాదం నుండి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నానని ఆమె చెప్పారు. అందుకు గల కారణం ప్రభాస్, పిల్లలు ఇస్తున్న ధైర్యమే. వాళ్లు ఇచ్చే ధైర్యం వల్లే ఇప్పుడిప్పుడే నేను నెమ్మదిగా కోలుకుంటున్నాను. అలాగే ఇటీవల కొన్ని యూట్యూబ్ ఛానెల్స్‌లో మా కుటుంబంపై చేస్తున్న ట్రోల్స్ చాలా బాధ కలిగించాయి అని తెలిపారు శ్యామలాదేవి. ముఖ్యంగా కృష్ణంరాజు కుటుంబానికి, ప్రభాస్ కుటుంబానికి పడటం లేదని రాయడం వల్ల ఎటువంటి లాభం ఉంటుందో అని పేర్కొన్నారు.

ఆ మాటలు నన్ను చాలా బాధ పెట్టాయి..

ఇటీవల ప్రభాస్ ఆరోగ్యం గురించి జ్యోతిష్యులు వేణుస్వామి చేసిన కామెంట్స్ చూసానని అవి ఎంతగానో బాధించాయని శ్యామలాదేవి అన్నారు. ప్రభాస్ జాతకం తన మదర్‌కి మాత్రమే తెలుసునని వేణుస్వామికి ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. అంతేకాకుండా ఆ సమయంలో వేణు స్వామి ప్రభాస్ గురించి ఆయన జాతకం గురించి చేసిన వ్యాఖ్యలు నిజంగా మమ్మల్ని బాధపెట్టాయి అని ఆమె చెప్పుకొచ్చింది. అదేవిధంగా వేణుస్వామి వ్యాఖ్యలు పట్టించుకోవద్దని ప్రభాస్ అభిమానులకు సూచించినట్లు శ్యామలాదేవి తెలిపారు. కాగా గతంలో ప్రభాస్ గురించి ఆయన జాతకం గురించి పెళ్లి విషయాల గురించి సినిమాల గురించి వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో డార్లింగ్ ఫాన్స్ ఒక రేంజ్ లో విరుచుకుపడుతూ వేణు స్వామిపై ట్రోల్స్ చేశారు. సలార్ సినిమా విషయంలో కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు వేణు స్వామి.