విజయ్ సేతుపతితో బైక్ రైడ్ చేసిన.. మిల్క్ బ్యూటీ!

మిల్క్ బ్యూటీ గా పేరు సంపాదించుకున్న నటి తమన్నా ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్నారు. ఒకవైపు వెండితెరపై సందడి చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లలో కూడా ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ బ్యూటీ చూపు బుల్లితెర పై కూడా పడింది. తాజాగా వివిధ భాషలలో ప్రసారం కానున్న మాస్టర్ చెఫ్ కార్యక్రమం కోసం తెలుగులో తమన్నాను హోస్ట్ గా ఎంపిక చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో ను విడుదల చేశారు.

ఈ ప్రోమోలో భాగంగా మిల్క్ బ్యూటీ తమన్నా తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి బైక్ పై తమన్నాను దించినట్టు తెలుస్తోంది. అదేవిధంగా విజయ్ సేతుపతి ఈ కార్యక్రమం సందర్భంగా తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని తను పడిన ఆకలి బాధలను తెలిపారు.అయితే తెలుగులో ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న తమన్నా ఈ కార్యక్రమానికి న్యాయం చేస్తుందా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి.

తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయడంతో అలాంటి సందేహాలకు పులిస్టాప్ పెట్టినట్లు అయింది. ఇకపోతే మాస్టర్ చెఫ్ ఈ కార్యక్రమాన్ని తమిళంలో కూడా నిర్వహించనున్నారు. అయితే తమిళంలో హీరో విజయ్ సేతుపతి ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. తెలుగులో మాస్టర్ చెఫ్ కార్యక్రమం జెమినీ టీవీలో ప్రసారం కానుంది. ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించిన అందుకు గాను తమన్నా భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు ఇండస్ట్రీ సమాచారం.

ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక సినిమాల విషయానికొస్తే తమన్నా ఎంతో బిజీగా ఉన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 3, గోపీచంద్ సిటీ మార్, నితిన్ మాస్ట్రో వంటి సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.