వెండితెరపై అద్భుతమైన అవకాశాలను దక్కించుకుంటూ అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా కొనసాగిన వారిలో రష్మిక ఒకరు.ప్రస్తుతం కోలీవుడ్ టాలీవుడ్ చిత్రాలతోపాటు బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మకు వరుసగా చిత్రాల్లో నటించే అవకాశాలను కొల్లగొట్టుకుంటుంది.తాజాగా సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా తరహాలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక నటిస్తున్నారు. అదే విధంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఓ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
ప్రస్తుతం మెగా హీరో రామ్ చరణ్ తేజ్ రాజమౌళి ఈ సినిమాతో ఎంతో బిజీగా ఉన్నారు. అదేవిధంగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ రెండు పూర్తి కాగానే తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలి చెర్రీ సరసన నటించడానికి చిత్ర బృందం రష్మికను సంప్రదించినట్టు తెలుస్తోంది.
శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని అందులో ఒకరి పాత్రలో నటించడానికి చిత్రబృందం రష్మికను సంప్రదించినట్లు తెలుస్తోంది. మరొక హీరోయిన్ ఉప్పెన బ్యూటీ కృతి శెట్టిని తీసుకోవాలనే ఆలోచనలో చిత్రబృందం ఉన్నారని ఇండస్ట్రీ సమాచారం.అయితే ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉంది అనే విషయం తెలియాలంటే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…