జమ్ములో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాది హాతం..!

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఈ ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది మరణించాడు. కుల్గాం జిల్లాలో బీఎస్‌ఫ్‌ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాలకు కూడా ఎదురు కాల్పలకు దిగాయి. ఈ భీకర ఎన్‌కౌంటర్‌లో లష్కరే తొయిబా ఉగ్రవాదిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. మరో ఉగ్రవాది కాల్పులను తప్పించుకున్నాడు.

అయితే ఈ ఘటనలో ఇద్దరు బీఎస్‌ఫ్‌ అధికారులతో, మరో ఇద్దరు స్థానిక పౌరులకు గాయాలయ్యాయి. వీరిని స్థానిక ఆస్పత్రిలో తరిలించారు.