Thamannah: ఆ సినిమాను మిస్ చేసుకుని ఇప్పటికి బాధపడుతున్నాను… తమన్నా కామెంట్స్ వైరల్!

Thamannah: టాలీవుడ్ మిల్క్ బ్యూటీగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నటువంటి తమన్న ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. తాజాగా ఈమె జైలర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకోవడంతో సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి తమన్నా రజినీకాంత్ గారితో నటించడం గురించి మాట్లాడుతూ తన సంతోషం వ్యక్తం చేశారు. చిన్నప్పటినుంచి రజనీకాంత్అంటే తనకు చాలా ఇష్టం ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. అయితే రజనీకాంత్ గారితో ఒక ఫోటో అయిన దిగాలన్నదే తన కోరిక అని తెలిపారు. కానీ ఆ కోరిక నెరవేరుతుందా లేదా అని ఆలోచిస్తూ ఉండేదాన్ని కానీ నెల్సన్ కారణంగా ఆయనతో కలిసి నటించే అవకాశం వచ్చిందని అందుకు డైరెక్టర్ నెల్సన్ కు కృతజ్ఞతలు తెలిపారు.

ఇకపోతే తన సినీ కెరియర్ గురించి కూడా తమన్న మాట్లాడుతూ తాను కెరియర్ పరంగా ఇప్పటికీ ఏదైనా బాధపడే విషయం ఉందా అంటే అది ప్రభాస్ తో చేయాల్సిన సినిమా అని తెలియజేశారు.ప్రభాస్ హీరోగా నటించిన మిస్టర్ ఫర్ఫెక్ట్ సినిమాలో ముందుగా తనకే హీరోయిన్గా అవకాశం వచ్చిందని తెలిపారు. అయితే అప్పటికే తాను బిజీగా ఉండటం వల్ల ఈ సినిమాలో నటించలేకపోయాను.

Thamannah: ఆ బాధ ఇప్పటికీ ఉంది..


ఈ సినిమా విడుదలైన తర్వాత ఈ సినిమాలో తానే నటించి ఉంటే బాగుండేదనిపించింది.ఇలా ఈ సినిమాని మిస్ చేసుకున్నందుకు తాను ఇప్పటికీ బాధపడుతూనే ఉంటానంటూ ఈ సందర్భంగా తమన్న తెలిపారు. అయితే ఈమెకు మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో అవకాశం వచ్చిందని తెలిపారు కానీ అది కాజల్ పాత్రలోనా లేక తాప్సి పాత్రలోనా అన్న విషయం మాత్రం తెలియలేదు.