Thamannah: టాలీవుడ్ మిల్క్ బ్యూటీగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నటువంటి తమన్న ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. తాజాగా ఈమె జైలర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకోవడంతో సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.
ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి తమన్నా రజినీకాంత్ గారితో నటించడం గురించి మాట్లాడుతూ తన సంతోషం వ్యక్తం చేశారు. చిన్నప్పటినుంచి రజనీకాంత్అంటే తనకు చాలా ఇష్టం ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. అయితే రజనీకాంత్ గారితో ఒక ఫోటో అయిన దిగాలన్నదే తన కోరిక అని తెలిపారు. కానీ ఆ కోరిక నెరవేరుతుందా లేదా అని ఆలోచిస్తూ ఉండేదాన్ని కానీ నెల్సన్ కారణంగా ఆయనతో కలిసి నటించే అవకాశం వచ్చిందని అందుకు డైరెక్టర్ నెల్సన్ కు కృతజ్ఞతలు తెలిపారు.
ఇకపోతే తన సినీ కెరియర్ గురించి కూడా తమన్న మాట్లాడుతూ తాను కెరియర్ పరంగా ఇప్పటికీ ఏదైనా బాధపడే విషయం ఉందా అంటే అది ప్రభాస్ తో చేయాల్సిన సినిమా అని తెలియజేశారు.ప్రభాస్ హీరోగా నటించిన మిస్టర్ ఫర్ఫెక్ట్ సినిమాలో ముందుగా తనకే హీరోయిన్గా అవకాశం వచ్చిందని తెలిపారు. అయితే అప్పటికే తాను బిజీగా ఉండటం వల్ల ఈ సినిమాలో నటించలేకపోయాను.
ఈ సినిమా విడుదలైన తర్వాత ఈ సినిమాలో తానే నటించి ఉంటే బాగుండేదనిపించింది.ఇలా ఈ సినిమాని మిస్ చేసుకున్నందుకు తాను ఇప్పటికీ బాధపడుతూనే ఉంటానంటూ ఈ సందర్భంగా తమన్న తెలిపారు. అయితే ఈమెకు మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో అవకాశం వచ్చిందని తెలిపారు కానీ అది కాజల్ పాత్రలోనా లేక తాప్సి పాత్రలోనా అన్న విషయం మాత్రం తెలియలేదు.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…