లాడ్జీలో మైనర్ బాలికపై అత్యాచారం.. ఇంటి యజమాని నమ్మించి మరి ఘటనకు పాల్పడ్డాడు..!

ఆ బాలిక ఇంట్లో పని మనిషిగా చేస్తుంది. తన తల్లిదండ్రుల వద్దకు వెళ్తానని ఆమె ఇంటి యజమానికి చెప్పింది. తాను తీసుకెళ్తానని చెప్పి ఆ యజమాని లాడ్జీకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ ఘటన మహరాష్ట్రలోని థానే జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మహరాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాకు వలస వచ్చారు ఓ దంపతులు.

అక్కడే ఇటుక బట్టీలో పని చేసుకుంటూ ఉండేవారు. వాళ్లకు 14 ఏళ్ల కూతురు ఉంది. ఆమె కూడా తల్లిదండ్రులకు ఆర్థికపరంగా ఉపయోగపడేందుకు థానే జిల్లా భివాండికి చెందిన ఒకరి ఇంట్లో పనికి కుదిరింది. ఈ క్రమంలో ఆమె ఆ ఇంట్లో ఇంటి పని, వంట పని చేస్తూ ఉండేది. అక్కడ అతడికి తన భార్య కూడా ఉంది. ఆ బాలిక అతడి భార్యతో క్లోజ్ గా ఉండేది.

ఓ రోజు అతడు ఆమెను తల్లిదండ్రుల వద్దకు తీసుకెళ్తానని చెప్పి ఆ మైనర్ ను బైక్ ఎక్కించుకున్నాడు. అక్కడ నుంచి నేరుగా అతడు అంగావ్ అనే ప్రాంతంలోని ఓ లాడ్జీకి తీసుకెళ్లాడు. ఎందుకు ఇక్కడకు తీసుకొచ్చావ్ అంటూ ఆ బాలిక ప్రతిఘటించింది. ఆ బాలికను బెదిరించి.. బలవంతంగా దాడి చేస్తూ.. అత్యాచారం చేశాడు.

ఆ తర్వాత జరిగిన విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు. తర్వాత బాధితురాలి తల్లిదండ్రుల వద్ద ఆ బాలికను వదిలేశాడు. ఆ బాలికకు జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడంతో పాటు.. మరికొన్ని సెక్షన్ల కింద అతడిపై కేసులు నమోదయ్యాయి. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.