ఆ బాలిక ఇంట్లో పని మనిషిగా చేస్తుంది. తన తల్లిదండ్రుల వద్దకు వెళ్తానని ఆమె ఇంటి యజమానికి చెప్పింది. తాను తీసుకెళ్తానని చెప్పి ఆ యజమాని లాడ్జీకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ ఘటన మహరాష్ట్రలోని థానే జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మహరాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాకు వలస వచ్చారు ఓ దంపతులు.
అక్కడే ఇటుక బట్టీలో పని చేసుకుంటూ ఉండేవారు. వాళ్లకు 14 ఏళ్ల కూతురు ఉంది. ఆమె కూడా తల్లిదండ్రులకు ఆర్థికపరంగా ఉపయోగపడేందుకు థానే జిల్లా భివాండికి చెందిన ఒకరి ఇంట్లో పనికి కుదిరింది. ఈ క్రమంలో ఆమె ఆ ఇంట్లో ఇంటి పని, వంట పని చేస్తూ ఉండేది. అక్కడ అతడికి తన భార్య కూడా ఉంది. ఆ బాలిక అతడి భార్యతో క్లోజ్ గా ఉండేది.
ఓ రోజు అతడు ఆమెను తల్లిదండ్రుల వద్దకు తీసుకెళ్తానని చెప్పి ఆ మైనర్ ను బైక్ ఎక్కించుకున్నాడు. అక్కడ నుంచి నేరుగా అతడు అంగావ్ అనే ప్రాంతంలోని ఓ లాడ్జీకి తీసుకెళ్లాడు. ఎందుకు ఇక్కడకు తీసుకొచ్చావ్ అంటూ ఆ బాలిక ప్రతిఘటించింది. ఆ బాలికను బెదిరించి.. బలవంతంగా దాడి చేస్తూ.. అత్యాచారం చేశాడు.
ఆ తర్వాత జరిగిన విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు. తర్వాత బాధితురాలి తల్లిదండ్రుల వద్ద ఆ బాలికను వదిలేశాడు. ఆ బాలికకు జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడంతో పాటు.. మరికొన్ని సెక్షన్ల కింద అతడిపై కేసులు నమోదయ్యాయి. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…