బిగ్ బాస్ సీజన్ 5 గ్రాండ్ ఫినాలేకు పవన్ కళ్యాణ్ రాకపోవడానికి కారణం ఇదే..!

బిగ్ బాస్ 5వ సీజన్ కూడా నిన్నటితో ముగిసింది. భారీ అంచనాల మధ్య ప్రారంభమైన 5వ సీజన్ అంచనాలను అందుకోలేకపోయిందని తెలుస్తోంది. గత సీజన్లలో లాగా ఈ సీజన్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

ముఖ్యంగా ప్రేక్షకులకు తెలియని కంటెస్టెంట్లు ఎక్కువగా ఉండటం ఈ సీజన్ కు మేయిన్ డ్రాబ్యాక్ గా చెబుతున్నారు. దీంతో పాటు బిగ్ బాస్ టాస్కులు కూడా ఆసక్తికరంగా లేకపోవడంతో ఈ షోపై అందరూ పెదవి విరిచారు. దీంతో బిగ్ బాస్ రేటింగ్ కూడా పడిపోయాయి.

అయితే ఈ షో గ్రాండ్ ఫినాలేను గ్రాండ్ గా ప్లాన్ చేశారు నిర్వాహకులు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ముఖ్య అతిథిగా తీసుకువచ్చే ప్రయత్నాలు చేశారు. ఒకవేళ పవర్ స్టార్ కనుక వస్తే షో తీరే మారిపోయేది. అయితే భీమ్లా నాయక్ సినిమా పనుల్లో బిజీగా ఉండటంతో పవన్ రావడం కుదరదని చెప్పేశాడట. ముఖ్యంగా బిగ్ బాస్ 4తో పోలిస్తే బిగ్ బాస్ 5 సీజన్ అంతగా ఆదరణ లేకపోవడంతోనే పవన్ కళ్యాణ్ రాలేదని సమాచారం.

 గ్రాండ్ ఫినాలేలో శ్యాంసింగరాయ్ టీం మాత్రమే హల్చల్ చేసింది. నాని, కృతిశెట్టి, సాయిపల్లవి మాత్రం శ్యామ్ సింగరాయ్ ప్రమోషన్స్ లో భాగంగా ఈ షోకు హాజరయ్యారు. మరోవైపు ట్రిపుల్ ఆర్ టీం కూడా గ్రాండ్ ఫినాలేకు వస్తుందని అనుకున్నప్పటికీ..కేవలం రాజమౌళి మాత్రమే హాజరయ్యారు. శ్రియ, సుకుమార్, రష్మిక కూడా తమ సినిమాల ప్రమోషన్స్ లో భాగంగా ఈ షోకు హాజరయ్యారు.