టాలీవుడ్ హీరోయిన్ హంసానందిని క్యాన్సర్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తనకు బ్రెస్ట్ క్యాన్సర్ సోకినట్టు వెల్లడించారు హంస నందిని. 18 ఏళ్ల క్రితం తన తల్లికూడా ఇదే వ్యాధితో మరణించిందని ఈ సందర్బంగా తెలిపారు హంస నందిని.
అయితే ఇప్పుడు తానూ తప్పక ఈ మహమ్మారిని జయిస్తాననే నమ్మకం తనకు ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం హంస నందిని కీమో థెరపీ తీసుకుంటున్నారు. ఇప్పటికే 9 సైకిల్స్ పూర్తవగా, మరో 7 సైకిల్స్ మిగిలి ఉన్నాయని తెలిపారు.
హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన హంస నందిని మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరువాత హీరోయిన్ గా పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. అయితే స్పెషల్ సాంగ్స్, గెస్ట్ అప్పెరియన్స్ లతో తెలుగు ప్రేక్షకుల మదిలో చోటు సంపాదించారు. ప్రభాస్ నటించిన మిర్చి సినిమాలో టైటిల్ సాంగ్ లో అలరించిన విషయం తెలిసిందే.
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…