టాలీవుడ్ హీరోయిన్ హంసానందిని క్యాన్సర్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తనకు బ్రెస్ట్ క్యాన్సర్ సోకినట్టు వెల్లడించారు హంస నందిని. 18 ఏళ్ల క్రితం తన తల్లికూడా ఇదే వ్యాధితో మరణించిందని ఈ సందర్బంగా తెలిపారు హంస నందిని.
అయితే ఇప్పుడు తానూ తప్పక ఈ మహమ్మారిని జయిస్తాననే నమ్మకం తనకు ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం హంస నందిని కీమో థెరపీ తీసుకుంటున్నారు. ఇప్పటికే 9 సైకిల్స్ పూర్తవగా, మరో 7 సైకిల్స్ మిగిలి ఉన్నాయని తెలిపారు.
హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన హంస నందిని మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరువాత హీరోయిన్ గా పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. అయితే స్పెషల్ సాంగ్స్, గెస్ట్ అప్పెరియన్స్ లతో తెలుగు ప్రేక్షకుల మదిలో చోటు సంపాదించారు. ప్రభాస్ నటించిన మిర్చి సినిమాలో టైటిల్ సాంగ్ లో అలరించిన విషయం తెలిసిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…