Tirumala Darshanam : సీనియర్ సిటిజన్స్ కు శుభవార్త చెప్పిన టీటీడీ… తిరుమల దర్శనం ఇక సులువు…!

Tirumala Darshanam : ఇండియాలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి అవి దర్శించుకుంటాం వస్తాం కానీ ఒక్క తిరుమల మాత్రం ఎన్ని సార్లు చూసినా ఆ దేవదేవుడిని తనివి తీరదు. ప్రతిసారి వెళ్లి ఆ అలంకారం ప్రియుడిని దర్శించుకోవాలని భావిస్తుంటారు. అయితే అక్కడ రద్ది కారణంగా ఎంతో కొంత ఇబ్బందైతే తప్పదు. యువకులతే ఎలాగోలా తిరుమల వెళ్లి దర్శనం సజావుగా చేసుకుని వస్తారు. మరీ చినపిల్లలున్న మహిళలకు కూడా వసతులు కల్పిస్తోంది టీటీడీ అయితే తాజాగా సీనియర్ సిటిజన్స్ కి ఊరట కలిగించింది.

60 ఏళ్ల పై బడిన వారికి 30 నిమిషాల్లో దర్శనం….

తాజాగా టీటీడీ 60 ఏళ్ళు పైబడిన వృద్దులకు దర్శనము ఆలస్యం కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. అందుకోసం ముందుగా ఆధార్ కార్డు ద్వారా 60 ఏళ్ల వయసున్న వారు రిజిస్టర్ చేసుకుంటే వారికి దర్శనం సెపరేట్ క్యూ లైన్ ద్వారా కేవలం అరగంట నుండి గంట లోపు అయిపోయేలాగా చర్యలు తీసుకుంటారు. ఇందుకోసం మిగికిన క్యూ లైన్లను కొంచం సేపు నిలిపి సీనియర్ సిటిజన్స్ కి దర్శనం చేయిస్తారు.

ఇక మరిన్ని వివరాలు తెలుసు కోవాలంటే టీటీడీ సలహా నెంబర్ 08772277777 హెల్ప్ లైన్ నెంబర్ కి కాల్ చేసి సందేహాలు నివృతి చేసుకోవచ్చు. ఇక దర్శనం అనంతరం కూడా ప్రసాదం లడ్డు తీసుకోడానికి కూడా ఎలక్ట్రిక్ వాహనాల సహాయంతో చేరుకునేలా వృద్ధులకు వసతులు కలిపిస్తోంది టీటీడీ.