ఓటీటీకి ఉదయ్ కిరణ్ చివరి చిత్రం వచ్చేది అప్పుడే?

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోలు వస్తుంటారు పోతుంటారు. కానీ కొందరు ఇండస్ట్రీలోకి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కేవలం నటన పై ఉన్న ఆసక్తి ద్వారా అవకాశాలను సంపాదించుకుని ఉన్నత స్థాయికి ఎదిగారు అలాంటి హీరోలలో దివంగత నటుడు ఉదయ్ కిరణ్ ఒకరు.ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న ఉదయ్ కిరణ్ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల అర్ధాంతరంగా తనువు చాలించారు. ఈ విధంగా ఉదయ్ కిరణ్ అకాల మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పవచ్చు.

ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వంలో ” చిత్రం” సినిమా ద్వారా అరంగ్రేటం చేసిన ఉదయ్ కిరణ్ మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత “మనసంతా నువ్వే”,” నువ్వు నేను”, నీ స్నేహం వంటి బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్న ఉదయ్ కిరణ్ ఆ తర్వాత నటించిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అయ్యాయి.

ఈ క్రమంలోనే ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన చివరి చిత్రం “చిత్రం చెప్పిన కథ”ఈ సినిమాను ఉదయ్ కిరణ్ చనిపోయిన ఏడాది అనగా 2014వ సంవత్సరంలోనే విడుదల చేయాలని భావించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడింది.తాజాగా ఉదయ్ కిరణ్ చనిపోయిన ఇన్ని సంవత్సరాలకు ఆయన నటించిన చివరి చిత్రం విడుదల చేయడానికి చిత్ర బృందం రంగం సిద్ధం చేసింది.

ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన చివరి సినిమా చిత్రం చెప్పిన కథ సినిమా నిర్మాతలు ఈ సినిమాను ప్రముఖ పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ తో రిలీజ్ పై ఒప్పందం కుదుర్చుకున్నారని, త్వరలోనే డిజిటల్ రిలీజ్ కాబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా విడుదలపై త్వరలోనే సమాచారం తెలియనుంది. ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ నటి నటి మదాలసా శర్మ హీరోయిన్ గా నటించగా మోహన్ ఏఎల్ఆర్కే దర్శకత్వంలో సీహెచ్ మున్నా నిర్మించారు.