సన్నీకి అత్త అవుదామనుకున్నా.. కానీ నా కూతురు.. ఉమాదేవి షాకింగ్ కామెంట్స్!

బిగ్ బాస్ సీజన్ పై కంటెస్టెంట్ గా హౌస్ లోకి వెళ్ళిన వారిలో కంటెస్టెంట్ ఉమాదేవి ఒకరు.ఈమె కార్తీకదీపం సీరియల్ లో అర్థ పావు భాగ్యం పాత్రలో నటించి ఎంతోమంది ప్రేక్షకాదరణ దక్కించుకున్నారు. ఈ పాపులారిటి తోనే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన ఈమె తన ముక్కుసూటి తనంతో రెండవ వారమే హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఇలా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఉమా దేవి సన్నీకి మద్దతు తెలుపుతున్నారు.

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉమాదేవి సన్నీ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. కల్యాణ వైభోగం సీరియల్ ప్రారంభం అవుతున్న సమయంలో ఈ సీరియల్ లో హీరో సన్నీ అని చెప్పారు. ఇక ఇందులో తనకు నేను మేనత్త పాత్రలో నటించాను. సన్నీ ఎవరు అని అనుకుంటూ ఉండగా అంతలో తన కూతురు వీజే అని సమాధానం చెప్పింది. షూటింగ్ మొదటి రోజు సన్నీని చూడగానే అబ్బాయి చాలా బాగున్నాడు తన పెద్ద కూతురుకి ఇచ్చి పెళ్లి చేద్దామని ఆశ పడ్డాను.

అంతలోగా తన కూతురు వచ్చి సన్నీ అన్నా అని పిలవడం వీళ్లిద్దరు తనని అన్నా అనడంతో సన్ని కూడా వీరిద్దరిని చెల్లెలుగా భావించి ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారు.అలా సన్నీకి అత్తను అవ్వాలనుకుంటే చివరికి పిన్నిని చేశారు. ఆ ఒక్క రోజు నా కూతురు రాకపోయి ఉంటే కథ మరోలా ఉండేదని ఉమాదేవి సన్నీ గురించి షాకింగ్ కామెంట్ చేశారు.