Crime News: మేనకోడలితో అక్రమ సంబంధం పెట్టుకున్న మామ..! అడ్డుగా ఉన్న భార్యను ఏం చేశాడంటే..!

Crime News: మేనకోడలితో అక్రమ సంబంధం పెట్టుకున్న మామ..! అడ్డుగా ఉన్న భార్యను ఏం చేశాడంటే..!

Crime News: అక్రమ సంబంధాలు, వ్యసనాలు పచ్చని సంసారాల్లో నిప్పులు పోస్తున్నాయి. కొంత మంది భార్యలు భర్తలను, పిల్లల్ని హత్య చేస్తుంటే…మరికొంతమంది భర్తలు భార్యల్ని కడతేరుస్తున్నారు. తాజాగా భార్యను చంపి నాటకం ఆడిన ఓ భర్త బండారం బట్టబయలైంది. సొంత మేనకోడలితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ… భార్య అడ్డంగా ఉందని దారుణంగా హత్య చేశారు ఓ దుర్మార్గుడు. 

Crime News: మేనకోడలితో అక్రమ సంబంధం పెట్టుకున్న మామ..! అడ్డుగా ఉన్న భార్యను ఏం చేశాడంటే..!
Crime News: మేనకోడలితో అక్రమ సంబంధం పెట్టుకున్న మామ..! అడ్డుగా ఉన్న భార్యను ఏం చేశాడంటే..!

ఈ ఘటన విజయనగరం జిల్లా కొత్తవలస మండలం అప్పన్నదొర పాలెం పంచాయతీలో జోడిమెరక గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నాగరాజు(33).. భార్య లక్ష్మీని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. తాజాగా తన భార్యను చంపినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

Crime News: మేనకోడలితో అక్రమ సంబంధం పెట్టుకున్న మామ..! అడ్డుగా ఉన్న భార్యను ఏం చేశాడంటే..!

తెర్లాం మండలం ఉద్దవోలుకు చెందిన లక్ష్మీతో నాగరాజుకు ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరిద్దరికి ఏడు ఏళ్ల బాబు యశ్వంత్ ఉన్నాడు. అయితే వరసకు మేనకోడులు అయ్యే మౌనికతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు నాగరాజు. ఈ క్రమంలోనే భార్యభర్తల మధ్య తరుచూ గొడవలు జరిగేవి. పలుమార్లు పెద్దల పంచాయతీ నిర్వహించి నాగరాజును మందలించారు.

దారిలోని జీడి తోటల్లోకి తీసుకెళ్లి..

ఎలాగైనా భార్య లక్ష్మీని అడ్డు తొలగించుకోవాలనుకున్న నాగరాజు పథకం ప్రకారం జనవరి 28న రాత్రి 7.30 గంటలకు స్వీట్ షాప్ లో పని ముగించుకుని వస్తున్న నాగలక్ష్మీని తీర్థం పోదామని స్కూటీ ఎక్కించుకున్నాడు. అది నమ్మిన భార్య భర్త మాటలు విని బైక్ ఎక్కింది. తొలుత ఏపీ మోడల్ స్కూల్ వైపు వెళ్లడంతో అనుమానం వచ్చిన లక్ష్మీ స్కూటీపై నుంచి దూకి పారిపోయేందుకు ప్రయత్నించింది. తిరిగి ఆమెను స్కూటీ ఎక్కించుకుని బలిఘట్టం రెవెన్యూ పరిధిలోని అర్థాన్న పాలెం దారిలోని జీడి తోటల్లోకి తీసుకెళ్లాడు. అక్కడే తనకు విడాకులు ఇవ్వాలని లక్ష్మీని కోరాడు. అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో బలంగా రాళ్లపైకి తోశాడు. దీంతో రాళ్లకుప్పపై పడి లక్ష్మీ స్పృహ కోల్పోయింది. ఇదే అదునుగా పెద్ద బండరాయితో మోదీ లక్ష్మీని హత్య చేశాడు నాగరాజు. అక్కడే ఉన్న ఎండుపుల్లలు వేసి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ విషయాన్ని పోలీసుల ముందు ఒప్పుకున్నాడు నిందితుడు నాగరాజు. భార్యను హత్య చేసిన నాగరాజును ఉరితీయాలంటూ.. గ్రామస్థులు ధర్నా చేశారు. పోలీస్ స్టేషన్ కు ర్యాలీ తీశారు.