Crime News: మేనకోడలితో అక్రమ సంబంధం పెట్టుకున్న మామ..! అడ్డుగా ఉన్న భార్యను ఏం చేశాడంటే..!
Crime News: అక్రమ సంబంధాలు, వ్యసనాలు పచ్చని సంసారాల్లో నిప్పులు పోస్తున్నాయి. కొంత మంది భార్యలు భర్తలను, పిల్లల్ని హత్య చేస్తుంటే…మరికొంతమంది భర్తలు భార్యల్ని కడతేరుస్తున్నారు. తాజాగా భార్యను చంపి నాటకం ఆడిన ఓ భర్త బండారం బట్టబయలైంది. సొంత మేనకోడలితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ… భార్య అడ్డంగా ఉందని దారుణంగా హత్య చేశారు ఓ దుర్మార్గుడు.
ఈ ఘటన విజయనగరం జిల్లా కొత్తవలస మండలం అప్పన్నదొర పాలెం పంచాయతీలో జోడిమెరక గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నాగరాజు(33).. భార్య లక్ష్మీని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. తాజాగా తన భార్యను చంపినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
తెర్లాం మండలం ఉద్దవోలుకు చెందిన లక్ష్మీతో నాగరాజుకు ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరిద్దరికి ఏడు ఏళ్ల బాబు యశ్వంత్ ఉన్నాడు. అయితే వరసకు మేనకోడులు అయ్యే మౌనికతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు నాగరాజు. ఈ క్రమంలోనే భార్యభర్తల మధ్య తరుచూ గొడవలు జరిగేవి. పలుమార్లు పెద్దల పంచాయతీ నిర్వహించి నాగరాజును మందలించారు.
ఎలాగైనా భార్య లక్ష్మీని అడ్డు తొలగించుకోవాలనుకున్న నాగరాజు పథకం ప్రకారం జనవరి 28న రాత్రి 7.30 గంటలకు స్వీట్ షాప్ లో పని ముగించుకుని వస్తున్న నాగలక్ష్మీని తీర్థం పోదామని స్కూటీ ఎక్కించుకున్నాడు. అది నమ్మిన భార్య భర్త మాటలు విని బైక్ ఎక్కింది. తొలుత ఏపీ మోడల్ స్కూల్ వైపు వెళ్లడంతో అనుమానం వచ్చిన లక్ష్మీ స్కూటీపై నుంచి దూకి పారిపోయేందుకు ప్రయత్నించింది. తిరిగి ఆమెను స్కూటీ ఎక్కించుకుని బలిఘట్టం రెవెన్యూ పరిధిలోని అర్థాన్న పాలెం దారిలోని జీడి తోటల్లోకి తీసుకెళ్లాడు. అక్కడే తనకు విడాకులు ఇవ్వాలని లక్ష్మీని కోరాడు. అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో బలంగా రాళ్లపైకి తోశాడు. దీంతో రాళ్లకుప్పపై పడి లక్ష్మీ స్పృహ కోల్పోయింది. ఇదే అదునుగా పెద్ద బండరాయితో మోదీ లక్ష్మీని హత్య చేశాడు నాగరాజు. అక్కడే ఉన్న ఎండుపుల్లలు వేసి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ విషయాన్ని పోలీసుల ముందు ఒప్పుకున్నాడు నిందితుడు నాగరాజు. భార్యను హత్య చేసిన నాగరాజును ఉరితీయాలంటూ.. గ్రామస్థులు ధర్నా చేశారు. పోలీస్ స్టేషన్ కు ర్యాలీ తీశారు.
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…
తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…
సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…