Upasana Konidela: కియారా అద్వానీ సిద్దార్థ్ మల్హోత్రా దంపతులకు క్షమాపణలు చెప్పిన ఉపాసన!

Upasana Konidela: బాలీవుడ్ ఇండస్ట్రీలో సెలబ్రిటీలుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న
కియారా అద్వానీ సిద్దార్థ్ మల్హోత్రా జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరిద్దరూ గత కొంతకాలంగా డేటింగ్ లో ఉంటూ చివరికి పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఇక ఈ దంపతులు మంగళవారం సాయంత్రం వివాహ బంధంతో ఒకటయ్యారు.

ఈ క్రమంలోనే నటి కియారా తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మేము శాశ్వత బంధంలోకి వెళ్ళామని మాకు మీ ఆశీర్వాదాలు కావాలి అంటూ తన పెళ్లి ఫోటోలను షేర్ చేసారు. ఇలా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో మంది ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఇకపోతే ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటుడు రామ్ చరణ్ దంపతులను తన పెళ్లికి ఆహ్వానించారు. అయితే కొన్ని కారణాలవల్ల రామ్ చరణ్ దంపతులు కియారా పెళ్లికి హాజరు కాలేకపోయారు. ఈ క్రమంలోనే వీరి పెళ్లి ఫోటోలను ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ కొత్త జంటకు క్షమాపణలు చెప్పారు.

Upasana Konidela: పెళ్లికి రాలేకపోయాను…

ఈ సందర్భంగా వీరికి పెళ్లి ఫోటోలను ఉపాసన షేర్ చేస్తూ ఎంతో చూడముచ్చటగా ఉన్నారు.. మీకు పెళ్లి శుభాకాంక్షలు అని శుభాకాంక్షలు తెలియజేస్తూ .. పెళ్లికి రాలేకపోయినందుకు క్షమాపణలు కూడా తెలిపారు. ఇలా ఉపాసన కీయారా దంపతులకు క్షమాపణలు తెలియజేస్తూ చేసినటువంటి ఈ పోస్టు వైరల్ గా మారింది.