Upasana Konidela: బాలీవుడ్ ఇండస్ట్రీలో సెలబ్రిటీలుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న
కియారా అద్వానీ సిద్దార్థ్ మల్హోత్రా జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరిద్దరూ గత కొంతకాలంగా డేటింగ్ లో ఉంటూ చివరికి పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఇక ఈ దంపతులు మంగళవారం సాయంత్రం వివాహ బంధంతో ఒకటయ్యారు.
ఈ క్రమంలోనే నటి కియారా తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మేము శాశ్వత బంధంలోకి వెళ్ళామని మాకు మీ ఆశీర్వాదాలు కావాలి అంటూ తన పెళ్లి ఫోటోలను షేర్ చేసారు. ఇలా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో మంది ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఇకపోతే ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటుడు రామ్ చరణ్ దంపతులను తన పెళ్లికి ఆహ్వానించారు. అయితే కొన్ని కారణాలవల్ల రామ్ చరణ్ దంపతులు కియారా పెళ్లికి హాజరు కాలేకపోయారు. ఈ క్రమంలోనే వీరి పెళ్లి ఫోటోలను ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ కొత్త జంటకు క్షమాపణలు చెప్పారు.
ఈ సందర్భంగా వీరికి పెళ్లి ఫోటోలను ఉపాసన షేర్ చేస్తూ ఎంతో చూడముచ్చటగా ఉన్నారు.. మీకు పెళ్లి శుభాకాంక్షలు అని శుభాకాంక్షలు తెలియజేస్తూ .. పెళ్లికి రాలేకపోయినందుకు క్షమాపణలు కూడా తెలిపారు. ఇలా ఉపాసన కీయారా దంపతులకు క్షమాపణలు తెలియజేస్తూ చేసినటువంటి ఈ పోస్టు వైరల్ గా మారింది.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…