Prakash Raj: సౌత్ ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన ప్రకాష్ రాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం. ఎన్నో సినిమాలలో హీరోగా నటించిన ప్రకాష్ రాజ్ ఆ తర్వాత విలన్ గా నెగిటివ్ పాత్రలలో నటించడమే కాకుండా, తండ్రిగా మంచి పాజిటివ్ పాత్రలలో కూడా నటించి మంచి గుర్తింపు పొందాడు. ఇలా భాషతో సంబంధం లేకుండా కొన్ని వందలకు పైగా సినిమాలలో నటించి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రకాష్ రాజ్ సౌత్ ఇండస్ట్రీలో నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపు ఏర్పరచుకున్నాడు.
ఇలా నటుడిగా గుర్తింపు పొందటమే కాకుండా రాజకీయాలలో కూడా చాలా చురుగ్గా ఉంటూ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాష్ రాజ్ “ది కాశ్మీర్ ఫైల్స్” సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాలలో ఇప్పుడు చర్చాంశనీయంగా మారాయి. ప్రస్తుతం కేరళలోని తిరువనంతపురంలో జరుగుతున్న మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ అనే ఈవెంట్ లో ప్రకాష్ రాజ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన ప్రకాష్ రాజ్ ‘పఠాన్’ సినిమా సూపర్ హిట్ అవ్వడం గురించి మాట్లాడుతు షారుఖ్ సినిమాను పొగడటమే కాకుండా.. మరొకవైపు ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాను కించపరుస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఈ ఈవెంట్ లో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. ‘పఠాన్’ సినిమాను బ్యాన్ చేయాలని కొందరు ఇడియట్స్ అన్నారు. కానీ ఇప్పుడు ఆ సినిమా రూ.700 కోట్లకు పైగా వసూలు చేసి దూసుకుపోతోంది. ఇప్పుడు ‘పఠాన్’ సినిమాను బ్యాన్ చేయాలని గోల చేసినవారు అప్పుడు మోడీ సినిమాకి కనీసం రూ.30 కోట్ల కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోయారని విమర్శించాడు.
ఇలా సినిమా బ్యాన్ చేయాలని కేవలం సౌండ్ పొల్యూషన్ మాత్రమే చేస్తారు. ఈమధ్య కాలంలో వచ్చిన చెత్త సినిమాలలో “ది కాశ్మీర్ ఫైల్స్”సినిమా కూడా ఒకటి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అంతేకాకుండా ఆ సినిమా దర్శకుడు ఆస్కార్ నామినేషన్ రాలేదని అడుగుతున్నాడు. అలాంటి చెత్త సినిమాకు భాస్కర్ అవార్డు కూడా రాదు” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రకాష్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాలలో చర్చనీయంగా మారాయి.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…