Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా వేద సినిమా ప్రీ రిలీజ్ వేడుకలలో పాల్గొన్నారు. ఈ సినిమా గత ఏడాది కన్నడ భాషలో విడుదల అయ్యి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాని ఫిబ్రవరి 9వ తేదీ తెలుగులో విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్లో ఈ సినిమా వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నందమూరి బాలకృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ..పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. ఇక ఈ సినిమాలో శివరాజ్ కుమార్ నటించగా తన భార్య నిర్మాతగా వ్యవహరించారు. ఈ క్రమంలోనే ఆయన శివరాజ్ కుమార్ భార్యపై ప్రశంసలకు కురిపిస్తూ ఇది మహిళా సాధికారతకు నిదర్శనమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో భాగంగా శివరాజ్ కుమార్ తండ్రి రాజ్ కుమార్, అలాగే ఏఎన్ఆర్ గురించి కూడా మాట్లాడుతూ వారిని తాను బాబాయి అని పిలిచే వారీననీ తెలిపారు. ఇక రాజ్ కుమార్ ఎన్టీఆర్ గార్లకు జన్మించడం తాము చేసుకున్న అదృష్టమని తెలిపారు. ఇక వారసత్వాన్ని తీసుకెళ్లడం అంటే ఎంతో కష్టంతో కూడుకున్న పని అని, అయితే వారి పేరు చెప్పుకొని ఎక్కువ కాలం ఇండస్ట్రీలో కొనసాగలేమని తెలిపారు.
ఒక సినిమా ద్వారా వారసత్వాన్ని మాత్రమే తీసుకెళ్లకుండా తమకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. ఈ విషయంలో రాజ్ కుమార్ ముగ్గురు సోదరులు విజయం సాధించారని తెలిపారు.ఇక దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ గురించి మాట్లాడుతూ ఆయన మన మధ్య ఉన్న లేకపోయినా ఆయన స్థానం ఎప్పటికీ తనదేనని తెలిపారు. ఒక చిన్న పని చేసిన ఆర్పాటంగా చెప్పుకునే ప్రస్తుత కాలంలో ఎన్నో మంచి పనులు చేసిన పునీత్ ఎలాంటి ఆర్భాటాలు చేయలేదని ఈ సందర్భంగా పునీత్ రాజ్ కుమార్ ను గుర్తు చేసుకున్నారు.
నేటి పట్టణ జీవనశైలిలో డెంగీ ప్రమాదం కొత్త రూపం దాల్చుతోంది. ఒకప్పుడు మురుగు నీరు, చెత్త ప్రదేశాలు ప్రధాన కారణాలుగా…
సీనియర్ నటుడు రాజశేఖర్ తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో…
ఇంటి వంటల్లో రుచితో పాటు ఆరోగ్యం కూడా కలగాలంటే సీజనల్ కూరగాయలతో తయారయ్యే వంటకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పోషకాహార నిపుణులు…
ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో జగద్గురు ఆదిశంకరుల జయంతి ఉత్సవాలు మంగళవారం వైభవంగా నిర్వహించబడ్డాయి. వైశాఖ…
ప్రస్తుత జీవనశైలిలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో సహజ పదార్థాలపై మళ్లీ దృష్టి పెడుతున్నారు చాలా మంది. మన వంటింట్లో…
ఇతిహాసాలలో ధర్మం, మానవత్వం గురించి చెప్పే గొప్ప ఉదాహరణల్లో ఒకటి రామాయణ యుద్ధం చివర్లో జరిగిన సంఘటనగా పండితులు పేర్కొంటారు.…