Urvashi Rautela: బాస్ పార్టీ పాట కోసం ఊర్వశి రౌటేలా రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Urvashi Rautela: బాబీ దర్శకత్వంలో చిరంజీవి శృతిహాసన్ జంటగా నటించిన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య.ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.ఇక ఈ సినిమా అతి తక్కువ సమయంలోనే బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా పది రోజుల వ్యవధిలోనే 200 కోట్ల కలెక్షన్లను రాబట్టి సంచలనం సృష్టించింది.

ఇక సినిమాలోని బాస్ పార్టీ సాంగ్ ఎలాంటి సంచలనం సృష్టించిందో మనకు తెలిసిందే. దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన మ్యూజిక్ కు మెగాస్టార్ చిరంజీవి పర్ఫామెన్స్ అద్భుతంగా సెట్ అయింది. ఇక ఈ పాటలో చిరంజీవి సరసన బాలీవుడ్ నటి ఊర్వశి రౌతెలా అదిరిపోయే పర్ఫామెన్స్ చేశారు.

ఈ పాటలో నటించడం కోసం ఊర్వశి తీసుకున్నటువంటి రెమ్యూనరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.ఈ సినిమాలోని ఈ పాటను ఒక ప్రత్యేకమైన సెట్ వేసి షూటింగ్ చేశారని తెలుస్తోంది. ఈ సెట్ కోసం సుమారు 30 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసినట్టు సమాచారం. ఇక ఈ పాటలో నటించినందుకు గాను నటి ఊర్వశి ఏకంగా రెండు కోట్ల రూపాయల ఛార్జ్ చేసినట్టు తెలుస్తుంది.

Urvashi Rautela: రెండు కోట్ల రెమ్యూనరేషన్ అంటే మామూలు విషయం కాదు…


ఇలా ఒక పాట కోసం రెండు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అంటే మామూలు విషయం కాదని పెద్ద మొత్తంలోనే ఈ రెమ్యూనరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది. కేవలం మూడు నిమిషాల పాటు కోసం ఊర్వశి రెండు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారంటే ఆమె క్రేజ్ ఇండస్ట్రీలో ఎలా ఉందో అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.