నన్ను ఇంట్లో మనిషిగా భావించేవారు.. పూజా హెగ్డే!

నాగ శౌర్య, రీతువర్మ జంటగా నటించిన తాజా చిత్రం వరుడు కావలెను. ఈ సినిమాతో లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయం కానుంది. పి డి వి ప్రసాద్ సమర్పణలో ప్రఖ్యాత నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్య దేవర నాగ వంశీ నిర్మించిన సినిమా ఇది. ఈ సినిమా ఈ నెల 29న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన సంగీత కార్యక్రమాన్ని ఈ చిత్ర యూనిట్ నిర్వహించింది.

అయితే ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే హాజరయ్యింది. ఈ సందర్భంగా పూజా హెగ్డే మాట్లాడుతూ.. హీరోయిన్ ని అతిథిగా పిలవడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఈ కార్యక్రమానికి నన్ను అతిథిగా పిలవడం నాకు చాలా ఆనందంగా ఉంది, ఆ క్రెడిట్ అంతా కూడా చిన్న బాబు వంశీ లకు దక్కుతుంది అని తెలిపింది. హారిక అండ్ హాసిని నా ఫ్యామిలీ బ్యానర్.

చిన్న బాబు గారు నన్ను ఇంట్లో మనుషిలా చూస్తారు అని తెలిపింది. దర్శకురాలు లక్ష్మి గారికి ఈ వరుడు కావలెను సినిమా మంచి సక్సెస్ రావాలి. ఈ వరుడు కావలెను సినిమాలను థియేటర్స్ లో ఫ్యామిలీ తో చూడాలి అనీ పూజా హెగ్డే తెలిపారు. సినిమా సూపర్ హిట్ అయ్యి ఈ చిత్ర బృందానికి మంచి పేరు లాభాలు రావాలి. ఇదే ఆనందంతో సక్సెస్ పార్టీలో కలుద్దాం అని పూజా హెగ్డే తెలిపింది.

ఈ కార్యక్రమంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్ రాధాకృష్ణ, నాగ శౌర్య, రీతు వర్మ, లక్ష్మీ సౌజన్య, దేవర నాగ వంశీ, విశాల్ చంద్రశేఖర్ దితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందించగా శ్రేయ ఘోషల్ పాటలను ఆలపించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.