తెలుగు సినీ ఇండస్ట్రీలో తాజాగా ఒక విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజబాబు కన్నుమూశారు. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న రాజబాబు గత రాత్రి తుది శ్వాస విడిచారు. రాజబాబు మరణంతో ఒక్కసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీ లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఎన్నో సినిమాలలో నటించి నటుడిగా ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్నారు. రాజబాబుకు భార్య ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు.
రాజబాబు స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మండలంలోని నరసరావుపేట. చిన్నప్పటి నుంచి రాజబాబుకు నటనపై ఆసక్తి ఉండేది. అలా 1995లో ఊరికి మొనగాడు సినిమా ఇండస్ట్రీకి అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత సింధూరం, సముద్రం ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, మురారి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, భరత్ అనే నేను లాంటి చిత్రాల్లో నటించారు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన స్వర్గం నరకం, రాధమ్మ పెళ్లి ఇలాంటి సినిమాలను సైతం నిర్మించారు.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మృదుస్వభావి గా రాజబాబుకు పేరుంది. ఇతను సినిమాల కంటే ఎక్కువగా సీరియల్ తోనే గుర్తింపును సంపాదించుకున్నారు. దాదాపుగా అరవై రెండు చిత్రాల్లో విభిన్నమైన పాత్రల్లో నటించారు. ఇక రాజబాబు మరణవార్త విన్న పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.
బుల్లితెరపై వసంతకోకిల, అభిషేకం, రాధ మధు, మనసు మమత, బంగారు పంజరం, మా కోడలు బంగారం లాంటి సీరియల్స్ లో నటించి అలరించారు. అంతేకాకుండా బుల్లితెరపై ప్రసారమయ్యే అమ్మ సీరియల్ లో రాజబాబు పాత్రకు నంది అవార్డు కూడా వచ్చింది. అయితే రాజబాబు మరణవార్త ఒక్కసారిగా ఆయన ఇంట్లో విషాదఛాయలు అలముకున్నాయి. ఆయన మరణవార్త విన్న వెండితెర సెలబ్రెటీలు, బుల్లితెర సెలబ్రిటీలు సైతం సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…