నాగ శౌర్య, రీతువర్మ జంటగా నటించిన తాజా చిత్రం వరుడు కావలెను. ఈ సినిమాతో లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయం కానుంది. పి డి వి ప్రసాద్ సమర్పణలో ప్రఖ్యాత నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్య దేవర నాగ వంశీ నిర్మించిన సినిమా ఇది. ఈ సినిమా ఈ నెల 29న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన సంగీత కార్యక్రమాన్ని ఈ చిత్ర యూనిట్ నిర్వహించింది.
అయితే ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే హాజరయ్యింది. ఈ సందర్భంగా పూజా హెగ్డే మాట్లాడుతూ.. హీరోయిన్ ని అతిథిగా పిలవడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఈ కార్యక్రమానికి నన్ను అతిథిగా పిలవడం నాకు చాలా ఆనందంగా ఉంది, ఆ క్రెడిట్ అంతా కూడా చిన్న బాబు వంశీ లకు దక్కుతుంది అని తెలిపింది. హారిక అండ్ హాసిని నా ఫ్యామిలీ బ్యానర్.
చిన్న బాబు గారు నన్ను ఇంట్లో మనుషిలా చూస్తారు అని తెలిపింది. దర్శకురాలు లక్ష్మి గారికి ఈ వరుడు కావలెను సినిమా మంచి సక్సెస్ రావాలి. ఈ వరుడు కావలెను సినిమాలను థియేటర్స్ లో ఫ్యామిలీ తో చూడాలి అనీ పూజా హెగ్డే తెలిపారు. సినిమా సూపర్ హిట్ అయ్యి ఈ చిత్ర బృందానికి మంచి పేరు లాభాలు రావాలి. ఇదే ఆనందంతో సక్సెస్ పార్టీలో కలుద్దాం అని పూజా హెగ్డే తెలిపింది.
ఈ కార్యక్రమంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్ రాధాకృష్ణ, నాగ శౌర్య, రీతు వర్మ, లక్ష్మీ సౌజన్య, దేవర నాగ వంశీ, విశాల్ చంద్రశేఖర్ దితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందించగా శ్రేయ ఘోషల్ పాటలను ఆలపించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కాలేయ సంబంధిత వ్యాధులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా Non-Alcoholic Fatty Liver Disease లేదా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ…
ఐపీఎల్ 2026 సీజన్లో కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. వరుస ఓటములతో ఒత్తిడిలో…
తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన స్వర్ణ కమలం చిత్రం ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. వెంకటేశ్ కెరీర్కు…
అండమాన్ సముద్రంలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుని వందలాది ప్రాణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ పౌరులతో ప్రయాణిస్తున్న…