నాగ శౌర్య, రీతువర్మ జంటగా నటించిన తాజా చిత్రం వరుడు కావలెను. ఈ సినిమాతో లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయం కానుంది. పి డి వి ప్రసాద్ సమర్పణలో ప్రఖ్యాత నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్య దేవర నాగ వంశీ నిర్మించిన సినిమా ఇది. ఈ సినిమా ఈ నెల 29న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన సంగీత కార్యక్రమాన్ని ఈ చిత్ర యూనిట్ నిర్వహించింది.
అయితే ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే హాజరయ్యింది. ఈ సందర్భంగా పూజా హెగ్డే మాట్లాడుతూ.. హీరోయిన్ ని అతిథిగా పిలవడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఈ కార్యక్రమానికి నన్ను అతిథిగా పిలవడం నాకు చాలా ఆనందంగా ఉంది, ఆ క్రెడిట్ అంతా కూడా చిన్న బాబు వంశీ లకు దక్కుతుంది అని తెలిపింది. హారిక అండ్ హాసిని నా ఫ్యామిలీ బ్యానర్.
చిన్న బాబు గారు నన్ను ఇంట్లో మనుషిలా చూస్తారు అని తెలిపింది. దర్శకురాలు లక్ష్మి గారికి ఈ వరుడు కావలెను సినిమా మంచి సక్సెస్ రావాలి. ఈ వరుడు కావలెను సినిమాలను థియేటర్స్ లో ఫ్యామిలీ తో చూడాలి అనీ పూజా హెగ్డే తెలిపారు. సినిమా సూపర్ హిట్ అయ్యి ఈ చిత్ర బృందానికి మంచి పేరు లాభాలు రావాలి. ఇదే ఆనందంతో సక్సెస్ పార్టీలో కలుద్దాం అని పూజా హెగ్డే తెలిపింది.
ఈ కార్యక్రమంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్ రాధాకృష్ణ, నాగ శౌర్య, రీతు వర్మ, లక్ష్మీ సౌజన్య, దేవర నాగ వంశీ, విశాల్ చంద్రశేఖర్ దితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందించగా శ్రేయ ఘోషల్ పాటలను ఆలపించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…