NTR: ఎవరికి తెలియకుండా ఎన్టీఆర్ జాతక దోషాన్ని దాచారు… వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు?

NTR: తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. ఈయన నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతూ పాన్ ఇండియా స్థాయిలో ఎంతోమంది పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు ఇకపోతే ఎన్టీఆర్ జాతకం గురించి తాజాగా ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి చేసినటువంటి కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఎన్టీఆర్ జాతకంలో దోషముందని ఆయన జాతకం ప్రకారం 2030వ సంవత్సరం వరకు రాజకీయాలకు దూరంగా ఉండాలని వేణు స్వామి తెలిపారు. ఈయన జాతకంలో రాజయోగం ఉందని ఈయన మక నక్షత్రంలో జన్మించారు. ఇది ఎంతో అద్భుతమైనటువంటి గడియ అంటూ వేణు స్వామి తెలిపారు.

ఇకపోతే ఎన్టీఆర్ జాతకంలో ఒక దోషముందని ఆ విషయాన్ని ఆయన తండ్రి గారు చాలా రహస్యంగా దాచారని తెలిపారు. ఈ విషయం తనకు ఎన్టీఆర్ కి సీనియర్ ఎన్టీఆర్ కి తప్ప మరి ఎవరికి తెలియదని వేణు స్వామి ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ఒకసారి ఎన్టీఆర్ గారి తల్లిని నేను తిరుమలలో కలిశాను ఆమె నాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ జాతకంలో ఉన్న దోషం గురించి చెప్పకుండా ఆయన జాతకం భలే చెబుతున్నారు అంటూ నాతో మాట్లాడారు.

రాజయోగం ఉంది..

ఎన్టీఆర్ తల్లి ఇలా మాట్లాడటంతో ఆయన జాతకంలో ఉన్నటువంటి సమస్య ఏంటో నాకు తెలుసు అమ్మ అంటూ తన జాతకం గురించి ఆమెకు వివరించాను అయితే ఈ విషయాన్ని చాలా రహస్యంగా ఉంచారని వేణు స్వామి తెలిపారు కానీ ఈయన ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్నారని 2030వ తర్వాత రాజకీయాల్లోకి వస్తే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అంటూ వేణు స్వామి ఈ సందర్భంగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.