Vijay Thalapathy: తమిళ సీనియర్ నటుడు డిఎండీకే పార్టీ నేత విజయ్ కాంత్ అనారోగ్య సమస్యలతో బాధపడితే గురువారం ఉదయం మరణించిన సంగతి మనకు తెలిసిందే. ఈయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ గురువారం ఉదయం కన్నుమూయడంతో కోలీవుడ్ చిత్రం పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ హీరోలు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి కెప్టెన్ విజయ్ కాంత్ కు నివాళులు అర్పించారు.
ఇలా విజయ్ కాంత్ కి నివాళులు అర్పించడం కోసం హీరో విజయ్ దళపతి కూడా వచ్చారు. డి ఎం డి కె పార్టీ కార్యాలయంలో ఆయన పార్థివ దేహం ఉంచగా అక్కడకు ఈయన వచ్చి నివాళులు అర్పించడమే కాకుండా కెప్టెన్ భార్య ప్రేమలతతో విజయ్ మాట్లాడి ఆమెను ఓదార్చి తిరిగి వెళ్లిపోయారు ఈ సమయంలోనే అభిమానులు పెద్ద ఎత్తున గుంపుగా చేరడంతో తోపులాట జరిగింది.
ఈ క్రమంలోనే గుర్తు తెలియని వ్యక్తి హీరో విజయ్ పై చెప్పు విసిరారు ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తనపై చెప్పు విసిరినప్పటికీ ఆయన మాత్రం వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లి కారులో కూర్చున్నారు అయితే తమ అభిమాన హీరో పట్ల చెప్పు దాడి జరిగిందనే విషయం తెలిసి విజయ్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కచ్చితంగా ఈ పని అజిత్ ఫాన్స్ చేసి ఉంటారంటూ ఆరోపణలు చేస్తున్నారు.
కెప్టెన్ సాక్షిగా..
కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పటినుంచో విజయ్ అజిత్ అభిమానుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వివాదం నడుస్తూ ఉంటుందనే సంగతి తెలిసిందే. ఇక ఇద్దరు హీరోల సినిమాలు కనుక విడుదలైతే వీరి అభిమానుల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది ఈ క్రమంలోనే విజయ్ పై వారి దాడి చేశారు అంటూ అభిమానులు భావిస్తున్నారు కానీ అజిత్ మాత్రం విజయ్ పట్ల జరిగినటువంటి ఈ దాడిని పూర్తిగా ఖండిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…